Nidhi Agarwal: సీక్రెట్‌గా పూజలు చేయిస్తున్న హీరోయిన్

సామాన్యులే కాదు.. సెలబ్రెటీలు కూడా జాతకాలను తెగ నమ్ముతుంటారు. నిజానికి కామన్‌ పీపుల్‌ కంటే సెలబ్రెటీలకే జాతకాలంటే ఎక్కువ నమ్మకం. అందుకే సమయం దొరికినప్పుడు దైవధ్యానంలో గడిపేస్తుంటారు చాలా మంది. పూజలు యాగాలు చేయిస్తుంటారు. రీసెంట్‌గా రష్మిక మందన తన ఇంట్లో వేణుస్వామితో ఓ యాగం నిర్వహించింది. ఇప్పుడు నిధి అగర్వాల్‌ కూడా వేణు స్వామితో ఓ యాగం నిర్వహించిన వీడియో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది.

  • Written By:
  • Publish Date - March 28, 2023 / 07:00 PM IST

ఇస్మార్ట్‌ శంకర్‌ తరువాత ఈ భామకు సరైన హిట్‌ లేదు. మంచి ప్రాజెక్ట్‌ కూడా రావడం లేదు. దీంతో కెరీర్‌లో సక్సెస్‌ కోసం ఈ యాగం నిర్వహించినట్టు సమాచారం. సెలబ్రెటీల జాతకాలు చెప్తూ వేణుస్వామి ఈ మధ్య బాగా ఫేమస్‌ అయ్యారు. కొందరు సెలబ్రెటీల జీవితాలు ఆయన చెప్పినట్టే మలుపు తిరగడంతో చాలా మందికి వేణు స్వామి మీద నమ్మకం ఏర్పడింది. మున్నా మైఖేల్‌ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నిధి అగర్వాల్‌.. సవ్యసాచి సినిమాతో టాలీవుడ్‌లో అడుగు పెట్టింది.

తమిళ్‌లో కూడా కొన్ని సినిమాలు చేసింది. కానీ ఇస్మార్ట్ శంకర్‌ తప్ప నిధికి పెద్దగా హిట్‌ పడలేదు. ప్రస్తుతం పవన్‌కళ్యాణ్‌, క్రిష్‌ కాంబోలో వస్తున్న హరిహరవీరమల్లు సినిమాలో చేస్తోంది. ప్రజెంట్‌ ఈ ప్రాజెక్ట్‌ మీదే ఆశలు పెట్టికుంది నిధి అగర్వాల్‌. వేణుస్వామి యాగాలు ఫలించి నిధికి హిట్‌ పడుతుందా.. కెరీర్‌ మళ్లీ సెట్‌ అవుతుందా చూడాలి.