SS RAJAMOULI: రాజమౌళితో అల్లు అర్జున్..! మరో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న జక్కన్న..

బాహుబలి, RRR లాంటి సన్షేషనల్ హిట్స్ తర్వాత మహేష్ బాబుతో మూవీ అనౌన్స్ చేశాడు రాజమౌళి. మరి ఆ తర్వాత ప్రాజెక్ట్ ఏంటా అని ఆరాతీస్తే.. మైండ్ బ్లాక్ అయ్యే న్యూస్ బయటకొచ్చింది. త్వరలో క్రేజీ కాంబినేషన్‌తో రాబోతున్నాడు.

  • Written By:
  • Publish Date - November 4, 2023 / 02:12 PM IST

SS RAJAMOULI: దర్శకధీరుడు రాజమౌళి (SS RAJAMOULI) ఫ్యాన్స్‌కి పూనకాలు లోడ్ చేసే బిగ్గెస్ట్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బాహుబలి, RRR లాంటి సన్షేషనల్ హిట్స్ తర్వాత మహేష్ బాబుతో మూవీ అనౌన్స్ చేశాడు రాజమౌళి. మరి ఆ తర్వాత ప్రాజెక్ట్ ఏంటా అని ఆరాతీస్తే.. మైండ్ బ్లాక్ అయ్యే న్యూస్ బయటకొచ్చింది. బాహుబలి, RRR సినిమాలతో ఇండియన్ బిగ్గెస్ట్ డైరెక్టర్‌గా నిలిచిన రాజమౌళి.. త్వరలో క్రేజీ కాంబినేషన్‌తో రాబోతున్నాడు. ఆ ఇద్దరు హీరోల్లో ఒకరు టాలీవుడ్ సంచలనం అయితే మరొకరు కోలీవుడ్ స్టార్ హీరో కావడం ఇంట్రెస్టింగ్. వాళ్లిద్దరే అల్లు అర్జున్ (ALLU ARJUN), అజిత్.

తమిళంలో అజిత్ లాంటి స్టార్ హీరో ఇమేజ్‌ని, అల్లు అర్జున్ స్టైలిష్ క్యారెక్టర్లను మ్యాచ్ చేస్తూ ఒక అద్భుతమైన కథను రాసి విజయేంద్ర ప్రసాద్ రిజిస్ట్రేషన్ కూడా చేయించినట్టుగా తెలుస్తోంది. విజయేంద్రప్రసాద్ ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథ మొత్తాన్ని రెడీ చేసి అజిత్, అల్లు అర్జున్‌కి చెప్పారని.. వాళ్లనుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చిందని టాక్. ఈ మూవీకి సాయి మాధవ్ బుర్రా డైలాగ్ రైటర్‌గా వర్క్ చేస్తున్నాడని తెలుస్తోంది. మహేష్ బాబుతో మూవీ తర్వాత రాజమౌళి ఈ మూవీని సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నాడట. పుష్ప సినిమాతో నేషనల్ అవార్డ్ అందుకున్న తొలి తెలుగు నటుడిగా నిలిచాడు అల్లు అర్జున్. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేయడమే కాకుండా.. భారీగా వసూళ్లు రాబట్టింది. పుష్పరాజ్ క్యారెక్టర్లో బన్నీ మేకోవర్, యాటిట్యూడ్‏ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక ఈ చిత్రానికి సీక్వెల్‏గా వస్తోన్న పుష్ప2పై ఇప్పుడు భారీగా అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ మరింత హైప్ క్రియేట్ చేసింది.

ఈ మూవీ తర్వాత బన్నీ సందీప్ వంగాతో కమిటయ్యాడు. ఆ తర్వాత త్రివిక్రమ్‌తో మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ రెండూ పూర్తయ్యే సరికి అటు రాజమౌళి.. మహేశ్ బాబుతో మూవీ కొలిక్కి వచ్చే ఛాన్స్ ఉంది. మరోవైపు తమిళ నాట బారీ ఫ్యాన్ ఫాలోయిగ్ ఉన్న అతి కొద్ది మంది హీరోల్లో అజిత్ ఒకడు. సాల్ట్ అండ్ పెప్పర్ స్టైల్లో నయా ట్రెండ్ సెట్ చేసిన అజిత్.. తన సినిమాలతో ప్రత్యేక ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు వీళ్లిద్దరి కాంబినేషన్లో మల్టీస్టారర్ మూవీకి దర్శకుడు రాజమౌళి అంటే లెక్కలు మారిపోవాల్సిందే. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే విజయేంద్ర ప్రసాద్, రాజమౌళి రియాక్టయ్యేవరకూ వెయిట్ చేయాల్సిందే.