SS RAJAMOULI: హాలీవుడ్ డైరెక్టర్ల రాక కోసమే రాజమౌళి ప్లానింగ్ మార్చాడా..?

జురాసిక్ పార్క్ ఫేం స్టీవెన్ స్పిల్ బర్గ్, అవతార్ ఫేం జేమ్స్ కామెరున్ ఇలా ఇద్దరికీ రాజమౌళితో ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ ఈవెంట్లతో ఏర్పడిన పరిచయం తెలిసిందే. అంతేకాదు.. ఈ ఇద్దరినీ మహేశ్ బాబు సినిమా లాంచింగ్‌కి రప్పించే ప్రయత్నం చేస్తున్నాడట రాజమౌళి.

  • Written By:
  • Publish Date - February 26, 2024 / 06:13 PM IST

SS RAJAMOULI: సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌళి తీయబోతున్న సినిమాని ఉగాది సందర్భంగా లాంచ్ చేయాలనుకున్నారు. కాని ఆల్ ఆఫ్ సడన్ గా ఏప్రిల్ 9 నుంచి ఆగస్ట్ 9కి సినిమా లాంచింగ్ డేట్ మారింది. దానికి సాలిడ్ రీజనుంది. హాలీవుడ్ డైరెక్టర్స్ రాకకోసమే జక్కన్న ఇలా ప్లాన్ మార్చాడట. జురాసిక్ పార్క్ ఫేం స్టీవెన్ స్పిల్ బర్గ్, అవతార్ ఫేం జేమ్స్ కామెరున్ ఇలా ఇద్దరికీ రాజమౌళితో ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ ఈవెంట్లతో ఏర్పడిన పరిచయం తెలిసిందే.

ALLU ARJUN: మరోసారి తెలంగాణ యాస మాట్లాడతానంటున్న బన్నీ..

అంతేకాదు.. ఈ ఇద్దరినీ మహేశ్ బాబు సినిమా లాంచింగ్‌కి రప్పించే ప్రయత్నం చేస్తున్నాడట రాజమౌళి. ఆ బాధ్యతని కొడుకు కార్తికేయకి అప్పచెప్పాడట. త్రిబుల్ ఆర్ ఆస్కార్ రేసులో ఉన్నప్పుడు కూడా కార్తికేయే ఆ ప్రమోషన్‌ని అక్కడి వరకు తీసుకెళ్లాడు. ఇప్పుడు హాలీవుడ్ డైరెక్టర్లని మహేశ్ బాబు మూవీ లాంచింగ్‌కి పిలిపించటమే కాకుండా.. ఇంటర్నేషనల్ మీడియాను కూడా ఆహ్వానిస్తోంది ఫిల్మ్ టీం. ఈ తతంగం అంతా సవ్యంగా జరగాలంటే దీనికి కూడా భారీ ప్లానింగ్ ఉండాలి. అందుకే ఏప్రిల్ 9 న కాకుండా ఆగస్ట్ 9కి లాంచింగ్‌ని వాయిదా వేసి, కాస్త టైం తీసుకుని ఈవెంట్‌ని గ్రాండ్‌గా ప్రిపేర్ చేస్తున్నారట.