SS RAJAMOULI: జనవరి 20న లాంచ్.. ఏప్రిల్‌లో గ్లింప్స్ షూటింగ్..?

ఏప్రిల్‌లో ప్రెస్‌మీట్ పెట్టి కథ, పాత్రలు, అలానే వర్కింగ్ టైటిల్ ఎనౌన్స్‌మెంట్ కూడా ఇవ్వబోతున్నాడు రాజమౌళి. రూ.1500 కోట్ల ఈ భారీ ప్రాజెక్ట్ ఆఫ్రికా అడవుల్లోని అద్భుతాల వేటలో ఉండే ఓ ఇండియన్ ప్రొఫెసర్ కథ అంటూ ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది.

  • Written By:
  • Publish Date - January 1, 2024 / 08:22 PM IST

SS RAJAMOULI: రాజమౌళి.. త్రిబుల్ ఆర్ తర్వాత మహేశ్ బాబుతో మూవీ తెరకెక్కించబోతున్నాడు. అది జూన్‌ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకొనే అవకాశం ఉంది. కాకపోతే ఏప్రిల్‌లో ఒక షెడ్యూల్ షూట్ చేసి, తర్వాత జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేశాడట జక్కన్న. ఇక ఏప్రిల్‌లో ప్రెస్‌మీట్ పెట్టి కథ, పాత్రలు, అలానే వర్కింగ్ టైటిల్ ఎనౌన్స్‌మెంట్ కూడా ఇవ్వబోతున్నాడు రాజమౌళి. రూ.1500 కోట్ల ఈ భారీ ప్రాజెక్ట్ ఆఫ్రికా అడవుల్లోని అద్భుతాల వేటలో ఉండే ఓ ఇండియన్ ప్రొఫెసర్ కథ అంటూ ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది.

Devara: దండయాత్ర.. దేవర’ గ్లింప్స్‌కు డేట్ ఫిక్స్..

ఇప్పటికే అమెజాన్ అడవుల్లో ఈ సినిమాకు కావాల్సిన చాలా లొకేషన్లు వెతికేశారు. 45 శాతం షూటింగ్ అమెజాన్ అడవుల్లోనే తెరకెక్కబోతోంది. ఇక శ్రీలంక, కంబోడియా, ఆస్ట్రేలియా లొకేషన్లు కూడా ఫిల్మ్ టీం రెక్కీ చేసి ఫిక్స్ చేసింది. రాజమౌళి తన సినిమాటోగ్రఫి నుంచి కాస్ట్యూమ్ డిజైనర్ వరకు, గ్రాఫిక్స్ సూపర్ వైజర్ నుంచి యాక్షన్ కొరియోగ్రాఫర్ వరకు ఈ నెల 20 నుంచి వర్క్ షాపులకు అందుబాటులో ఉండాలని హుకూం జారిచేశాడు. మహేశ్ కూడా ఈ నెల 20 నుంచే ఈ సినిమా వర్క్ షాపులకు అటెండ్ కాబోతున్నాడు. ఏప్రిల్ మొదటి వారం గ్లింప్స్ కోసం షూటింగ్ చేస్తారట. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగబోతోందట. ఈనెల 20న ఈ చిత్రం కోసం ఆఫీస్ లాంచ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.