ANIMAL: యానిమల్ విషయంలో సైలెంట్ అయిన దర్శక ధీరుడు, మహేశ్..!

మహేశే కాదు దర్శక ధీరుడు రాజమౌళి కూడా యానిమల్ చూశాడు. అది కూడా ఫ్యామిలీతో కలిసి స్పెషల్ షో వేయించుకుని మరీ చూశాడు. సందీప్ రెడ్డి వంగనే ఈ స్పెషల్ షోని రాజమౌళి కోసం వేయించాడు. అయినా ఇంతవరకు జక్కన్న తన రివ్యూ ఇవ్వలేదు.

  • Written By:
  • Publish Date - December 13, 2023 / 06:12 PM IST

ANIMAL: యానిమల్ మూవీ నిజంగానే సూపర్ స్టార్ మహేశ్ బాబుకు నచ్చలేదా? మొన్న యానిమల్ ప్రి రిలీజ్ ఈవెంట్‌కి అడగ్గానే మహేశ్ వచ్చాడు. రణ్‌బీర్ కపూర్ నటనకి తాను ఫ్యాన్ అన్నాడు. సందీప్ రెడ్డి వంగా తీసిన అర్జున్ రెడ్డి సినిమాకు ఫిదా అయ్యాయన్నాడు. అలాంటి స్టార్‌ని సందీప్ రెడ్డి ఇంప్రెస్ చేయలేకపోయినట్టున్నాడు. ఎందుకంటే యానిమల్ మూవీ ఎలా ఉందో బన్నీ నుంచి ప్రభాస్ వరకు అంతా ఆకాశానికెత్తారు. అదో అద్భుతం అన్నారు.

Shah Rukh Khan: షారుఖ్ సక్సెస్ సీక్రెట్.. అమ్మవారిని దర్శించుకుంటే హిట్ ఖాయమా!

కాని మహేశ్ నుంచి రెస్పాన్సే లేదు. సరే.. గుంటూరు కారం షూటింగ్‌తో బిజీ అయ్యాడు కదా చూడలేదనుకుందామంటే.. అదీ లేదు. మహేశ్ సినిమా చూశాడు. కాని రెస్పాన్స్ లేదు. మహేశే కాదు దర్శక ధీరుడు రాజమౌళి కూడా యానిమల్ చూశాడు. అది కూడా ఫ్యామిలీతో కలిసి స్పెషల్ షో వేయించుకుని మరీ చూశాడు. సందీప్ రెడ్డి వంగనే ఈ స్పెషల్ షోని రాజమౌళి కోసం వేయించాడు. అయినా ఇంతవరకు జక్కన్న తన రివ్యూ ఇవ్వలేదు. వోడ్కాకి, లేడీస్‌కే టైం కేటాయిస్తాననే రామ్ గోపాల్ వర్మ లాంటి దర్శకుడు కూడా యానిమల్‌ని పొగిడేశాడు. కాని రాజమౌళి, మహేశ్ నుంచి రెస్పాన్స్ ఇంతవరకు రాలేదు. దానికి కారణం.. వాళ్లు సందీప్ రెడ్డి వంగకే ఫోన్ చేసి యానిమల్ అదిరిపోయిందని చెప్పారట.

కాని అదే విషయం సోషల్ మీడియాలో పోస్ట్ చేసేందుకు ఇద్దరు వెనకాడుతున్నారు. ఎందుకంటే, యానిమల్‌లో మరీ బరితెగించే సీన్లు, బూతులు, అతి వయొలెన్స్‌తోపాటు లేడీస్‌ని కించపరిచే సీన్లున్నాయనే కామెంట్స్ వస్తున్నాయి. కాంగ్రెస్ మహిళా ఎంపీ కూడా ఇది స్త్రీ ద్వేషపు విషపు సినిమా అనేశారు. ఇలాంటి టైంలో యానిమల్ బాగుందని ట్వీట్లు పెడితే మహేశ్‌తోపాటు రాజమౌళి మీద మహిళా సంఘాలు విరుచుకుపడే ఛాన్స్ ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్‌లో వీళ్ల ఇమేజ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అందుకే ఫోన్ చేసి సందీప్‌ని మెచ్చుకున్నారో, లేదంటే సినిమా నచ్చక రెస్పాండ్ కాలేదేమో కానీ.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయకపోవటానికి బయటి కామెంట్లే కారణమని తెలుస్తోంది.