SS RAJAMOULI: రాజమౌళి సైలెన్స్ వెనుక భారీ వయొలెన్స్..?

తన బర్త్ డే రోజు కూడా రాజమౌళి ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. మహేశ్ కూడా జక్కన్నను విష్ చేశాడు. ఇలా ట్వీట్లు తప్ప ఎటువంటి అప్‌డేట్లు మాత్రం లేవు. కారణం కూడా లాంచింగ్‌కి, షూటింగ్‌కి ఇంకా ఏడాదికిపైనే టైం ఉంది. కాబట్టే ఇప్పుడే ఎందుకు అప్‌డేట్స్ అనేది ఫిల్మ్ టీం నిర్ణయంగా తెలుస్తోంది.

  • Written By:
  • Publish Date - October 10, 2023 / 05:53 PM IST

SS RAJAMOULI: సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌళి ప్లాన్ చేసిన సినిమా జనవరిలో లాంచ్.. జూన్ వరకు వర్క్ షాపులు.. ఆగస్ట్ నుంచి షూటింగ్ అన్నది ఒకప్పటి మాట. తర్వాత ఏప్రిల్‌కి లాంచ్ వాయిదా.. వచ్చే దసరా వరకు వర్క్ షాపులు.. నెక్ట్స్ ఇయర్ దీపావళి నుంచి షూటింగ్ అనేది కొత్త ప్లానింగ్ అంటూ ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమనేంతగా సమాచారం అందుతోంది. ఇప్పుడు రాజమౌళి రియాక్షన్ బట్టి కూడా అదే విషయం అర్ధమౌతోంది. ఒకవేళ ఈ సినిమా జనవరికే లాంచ్ అనుకుంటే ఇప్పటికే ఆ ఊపు ఉండేది.

కాబట్టే తన బర్త్ డే రోజు కూడా రాజమౌళి ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. మహేశ్ కూడా జక్కన్నను విష్ చేశాడు. ఇలా ట్వీట్లు తప్ప ఎటువంటి అప్‌డేట్లు మాత్రం లేవు. కారణం కూడా లాంచింగ్‌కి, షూటింగ్‌కి ఇంకా ఏడాదికిపైనే టైం ఉంది. కాబట్టే ఇప్పుడే ఎందుకు అప్‌డేట్స్ అనేది ఫిల్మ్ టీం నిర్ణయంగా తెలుస్తోంది. ఏదేమైనా 55 శాతం పూర్తైన గుంటూరు కారానికి గుమ్మడి కాయ కొట్టేందుకు మహేశ్ బాబు అటువైపే ఫోకస్ పెట్టాడు. అయితే రాజమౌళి ఇంకా మహేశ్ మూవీ లాంచింగ్‌ని డిలే చేయటానికి కారణం కథ సిద్దం కాకకాదు. ఈ మూవీ రెండు భాగాలుగా మార్చాల్సి రావటం. ఏదో కథని విభజించి రెండు పార్టులు తీయాలనుకున్నంత ఈజీ కాదు ఆ ఫార్ములా ఫాలో అవటం. రెండు భాగాల కథలకు ఆ స్థాయి సరుకు ఉంటేనే పార్ట్ 1, పార్ట్ 2 గా విభజించ వచ్చు.

అదే సాధ్యమైంది. పార్ట్ 2 కథ ప్రిపరేషన్‌లో భాగంగా ఫిల్మ్ టీం ఎక్కువ టైం తీసుకుంటోంది. ఇక ఈ సినిమాలో 80శాతం ఫైట్లు, యాక్షన్ ఎపిసోడ్లు, 20శాతం మాత్రమే డ్రామా అనే అంశం బయటికి పొక్కింది. సో సినిమా అప్‌డేట్స్ ఇవ్వకుండా సైలెన్స్‌తో గడిపేస్తున్న మూవీ యూనిట్.. ఆ ప్రాజెక్ట్‌లో వయొలెన్స్‌ని భారీగా నింపే ప్లానింగ్‌లో బిజీగా ఉంది.