SS Rajamouli: ఓ మై గాడ్… మహేశ్ సినిమాపై రూమర్స్ ఉత్తుత్తి న్యూస్ కాదా..!

నెల రోజుల క్రితమే ఈ సినిమా మూడు భాగాలుగా రానుందనే గుసగుసలొచ్చాయి. కాని ఇంకా ప్రీ ప్రొడక్షన్ పనులే షురూ కాలేదు, అప్పుడే మూడు భాగాలుగా ఈ ప్రాజెక్ట్ అంటే సోది వార్త అనుకున్నారు చాలా మంది. కాని బాహుబలి 1, 2 తో పోలిస్తే ఇది మూడు భాగాలుగా తెరకెక్కే భారీ మూవీ అని కొత్త లీకులతో తేలిపోయింది.

  • Written By:
  • Publish Date - April 14, 2023 / 05:47 PM IST

SS Rajamouli: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి.. తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేశ్ బాబుతో తీయబోతున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో సినిమాపై భారీ అంచనాలున్నాయి. దీంతో సినిమాకు సంబంధించి అనేక రూమర్లు, గాసిప్స్ వినిపిస్తూనే ఉన్నాయి.

అందులో ఏది నిజమో.. ఏది అబద్దమో అనుకునేలోపు మైండ్ బ్లోయింగ్ లీకు ఒకటి షాక్ ఇస్తోంది. అదే ఈ మూవీ మూడు భాగాలుగా రానుందనే వార్త కేవలం రూమర్ కాదట. నెల రోజుల క్రితమే ఈ సినిమా మూడు భాగాలుగా రానుందనే గుసగుసలొచ్చాయి. కాని ఇంకా ప్రీ ప్రొడక్షన్ పనులే షురూ కాలేదు, అప్పుడే మూడు భాగాలుగా ఈ ప్రాజెక్ట్ అంటే సోది వార్త అనుకున్నారు చాలా మంది. కాని బాహుబలి 1, 2 తో పోలిస్తే ఇది మూడు భాగాలుగా తెరకెక్కే భారీ మూవీ అని కొత్త లీకులతో తేలిపోయింది. హనుమాన్ ప్రేరణగా హీరో పాత్రను డిజైన్ చేసిన రాజమౌళి.. అసలు స్టోరీ లైన్‌ని 4 నెలల క్రితమే విజయేంద్ర ప్రసాద్‌కి చెప్పాడట. ఆ కాన్సెప్టే మూడు వెర్షన్‌లలో రెడీ అయ్యిందని తెలుస్తోంది.

ఐతే ఆ మూడు వర్షన్ కథల్ని మూడు సీక్వెల్స్ రూపంలో ప్లాన్ చేస్తే ఎలా ఉంటుందనే చర్చ నెల క్రితమే జరిగిందట. ఆ కథ కాస్త షేప్ కొచ్చే సరికి మూడు భాగాలుగా తెరకెక్కించాలనే ఆలోచననే ఫైనల్ చేశాడట రాజమౌళి. అంటే ఒక్కో భాగానికి మినిమమ్ 2 ఏళ్లు అనుకున్నా.. సినిమా పూర్తయ్యే సరికి ఆరేళ్లు పడుతుంది. దీంతో 6 ఏళ్ల వరకు వేరే సినిమాలకు మహేశ్ అందుబాటులో ఉండడా? లేదు.. మధ్యలో ఏదైనా ఆలస్యం అయితే మహేశ్ బాబు కెరీర్ రాజమౌళి తీసే మూడు భాగాలకే పరిమితమౌతుందా? ఇవే డౌట్లు పెరుగుతున్నాయి ఇప్పుడు ఫిలిం సర్కిల్‌లో. ఏదేమైనా మహేశ్‌తో రాజమౌలి తీయబోయే సినిమా మూడు భాగాలు అనే ప్రచారం.. ఉట్టి గాసిప్ కాదనే సమాచారమే అందుతోంది. పూర్తి వివరాలు తెలిసేందుకు ఇంకాస్త సమయం పడుతుంది.