SS RAJAMOULI: రాజమౌళి ఒక్క మాట విని ఫ్యాన్స్ ఎక్కడికో వెళ్లిపోతున్నారా?

ముందు అంతా అనుకున్నట్టు ఈమూవీలో చెల్సియా అనే ఇండోనేషియా నటి హీరోయిన్ కాదని తేలింది. ఒక వేళ తనని కాని మరెవర్ని కాని తీసుకున్నా, జక్కన్న ఎనౌన్స్ చేయాలి. కాబట్టి.. ఇప్పటి వరకు ఎవర్ని ఫిక్స్ చేయలేదు, ఇవన్నీ ఊహాగానాలని తేలిపోయింది.

  • Written By:
  • Publish Date - March 19, 2024 / 06:11 PM IST

SS RAJAMOULI: సూపర్ స్టార్ మహేశ్ బాబుతో తను తీయబోయే సినిమా తాలూకు అప్‌డేట్‌ని జపాన్‌లో ఇచ్చాడు దర్శకధీరుడు రాజమౌళి. కేవలం స్క్రిప్టే సిద్దమైందన్నాడు. హీరో తప్ప సినిమాలో ఎవరు నటులో డిసైడ్ కాలేదన్నాడు. దాంతో పాటు రాజమౌళి చెప్పిన సూపర్ స్టార్ ఫ్యాన్స్ లో ఎక్కడ లేని ఉత్సాహం తెచ్చేస్తోంది. అదే ఈ సినిమా ఎప్పుడు పూర్తవుతుందో చెప్పటమే. ముందు అంతా అనుకున్నట్టు ఈమూవీలో చెల్సియా అనే ఇండోనేషియా నటి హీరోయిన్ కాదని తేలింది.

VIJAY DEVARAKONDA: ఫ్యామిలీ స్టార్‌గా రేంజ్ ఎంతో తేలిపోతోందా..?

ఒక వేళ తనని కాని మరెవర్ని కాని తీసుకున్నా, జక్కన్న ఎనౌన్స్ చేయాలి. కాబట్టి.. ఇప్పటి వరకు ఎవర్ని ఫిక్స్ చేయలేదు, ఇవన్నీ ఊహాగానాలని తేలిపోయింది. కాకపోతే మొన్నటి వరకు వచ్చిన గుసగుసల ప్రకారం మరో మూడేళ్ల వరకు రాజమౌళి సినిమాకే మహేశ్ అంకితం అన్నారు. అది నిజం కాదనేలా హింట్ ఇచ్చాడు జక్కన్న. ఎందుకంటే చాలా క్విక్‌గా సినిమాని పూర్తి చేస్తానన్నాడు. ఆ ఒక్క మాటకి ఫ్యాన్స్ మొత్తం ఖుషీ అయ్యే పరిస్థితి. బాహుబలి వల్ల ప్రభాస్ 4 ఏళ్ళు జనాలకు దూరమయ్యాడు. త్రిబుల్ ఆర్ వల్ల చరణ్, తారక్ మూడేళ్లు సెట్‌కే పరిమితమయ్యారు. మధ్యలో కరోనా బ్రేక్ పడటం కూడా మైనస్ అయ్యింది.

ఇవన్నీ పక్కన పెడితే మహేశ్ బాబుతో సినిమా 2025 మే లోగా పూర్తయ్యేలా షూటింగ్ ప్లాన్ చేశాడు రాజమౌళి. టాకీ పార్ట్ వచ్చే సమ్మర్‌లోగా పూర్తవుతుంది. ఏదైనా డిలే ఉంటే గ్రాఫిక్స్, పోస్ట్ ప్రొడక్షన్ తప్ప, వచ్చే ఏడాది మే తర్వాత మహేశ్ మళ్లీ వేరే సినిమాలు చేసుకోవచ్చు. ఇలా జక్కన్న ప్లాన్ చేయటంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కి పండగ వచ్చినట్టవుతోంది.