Thaman S: కడుపు మండితే లస్సీ తాగండి.. తమన్‌ పంచులు ఎవరికి..?

మహేష్‌ బాబు, తమన్‌ మధ్య గ్యాప్‌ ఉన్న కారణంగానే త్రివిక్రమ్.. తమన్‌ను ప్రాజెక్ట్‌ నుంచి తప్పించారని అంతా అనుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో ఇదే విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీంతో ఈ విషయంలో తమన్‌ ఇండైరెక్ట్‌గా క్లారిటీ ఇచ్చాడు.

  • Written By:
  • Publish Date - June 21, 2023 / 11:52 AM IST

Thaman S: సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న గుంటూరు కారం సినిమాకు ఎస్‌ఎస్‌ తమన్‌ మ్యూజిక్‌ అందిస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఇప్పటికే ఓ గ్లింప్స్ కూడా రిలీజ్‌ చేశారు. దీనికి ఆడియన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్‌ కూడా వచ్చింది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌ నుంచి తమన్‌ను తొలగించారనే టాక్‌ నడుస్తోంది.

మహేష్‌ బాబు, తమన్‌ మధ్య గ్యాప్‌ ఉన్న కారణంగానే త్రివిక్రమ్.. తమన్‌ను ప్రాజెక్ట్‌ నుంచి తప్పించారని అంతా అనుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో ఇదే విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీంతో ఈ విషయంలో తమన్‌ ఇండైరెక్ట్‌గా క్లారిటీ ఇచ్చాడు. కడుపులో మంట సమస్య ఉన్నవాళ్లు అరటిపండ్లు తింటే మంచిదంటూ ట్వీట్‌ చేశాడు. ఇవాళ లస్సీ గ్లాస్‌తో మరో ట్వీట్‌ చేశాడు. కడుపు మంటతో బాధపడుతున్నవాళ్ల కోసం తన ఆఫీస్‌ ముందు ఓ లస్సీ షాప్‌ పెడుతానంటూ లస్సీ గ్లాస్‌ ఫొటో ట్వీట్‌ చేశాడు. లస్సీ పూర్తిగా ఉచితమని, కడుపు మంట ఉన్నవాళ్లు లస్సీ తాగి ఊరుకోవాలని, తన టైం వేస్ట్‌ చేయొద్దని ట్వీట్‌ చేశాడు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నవాళ్లకు కౌంటర్‌ ఇచ్చేందుకే తమన్‌ ఈ ట్వీట్‌ చేశాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

కానీ కొందరు మాత్రం ఈ ట్వీట్‌ ట్రోలర్స్‌కు కాదని గుంటూరు కారం టీంకే అంటూ కామెంట్లు చేస్తున్నారు. తమన్‌ను మరో మ్యూజిక్‌ డైరెక్టర్‌తో రీప్లేస్‌ చేసిన కారణంగానే తమన్‌ ఇలా పోస్టులు పెడుతున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే నిజంగా తమన్‌ ఈ ట్వీట్లు తనపై దుష్ర్పచారం చేస్తున్నవాళ్లకు కౌంటర్‌గానే పెట్టాడా లేక త్రివిక్రమ్‌కు కౌంటర్‌గా పెట్టాడా అనేది మరో సస్పెన్స్‌గా మారింది. తమన్‌ను తీశేశారు అన్న విషయంలో మూవీ యూనిట్‌ నుంచి ఎలాంటి రెస్పాన్స్‌ లేదు. ఈ విషయంలో సినిమా టీమ్ ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి.