Venu Swamy : బాంబ్ పేల్చాడు ఇండస్ట్రీకి సూపర్ స్టార్‌ గుడ్‌ బై

ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ వేణు స్వామికి మంచి క్రెడిబిలిటీ ఉంది. అతడు చెప్పేవి జరుగుతాయని.. ఆయనతో పూజలు చేయించుకుంటే కెరీర్ సక్సెస్ఫుల్ గా సాగుతుందని నమ్మేవారు ఉన్నారు. సెలబ్రిటీల జాతకాలను చెబుతూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారాయన. పైగా కొందరు హీరోలు, హీరోయిన్స్ విషయంలో ఆయన చెప్పిన విషయాలు నిజమవ్వడంతో ఎక్కువ మంది ఆయన జాతకాలను నమ్ముతారు. అదే సమయంలో ఆయన జాతకాలపై విమర్శలు చేసేవారు కూడా చాలామందే ఉన్నారు. ఈ సంగతి పక్కన పెడితే లేటేస్ట్ గా ఆయన చేసిన కామెంట్స్ గుబులు రేపడంతో పాటు సంచలనం రేపుతున్నాయి.

ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ వేణు స్వామికి మంచి క్రెడిబిలిటీ ఉంది. అతడు చెప్పేవి జరుగుతాయని.. ఆయనతో పూజలు చేయించుకుంటే కెరీర్ సక్సెస్ఫుల్ గా సాగుతుందని నమ్మేవారు ఉన్నారు. సెలబ్రిటీల జాతకాలను చెబుతూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారాయన. పైగా కొందరు హీరోలు, హీరోయిన్స్ విషయంలో ఆయన చెప్పిన విషయాలు నిజమవ్వడంతో ఎక్కువ మంది ఆయన జాతకాలను నమ్ముతారు. అదే సమయంలో ఆయన జాతకాలపై విమర్శలు చేసేవారు కూడా చాలామందే ఉన్నారు. ఈ సంగతి పక్కన పెడితే లేటేస్ట్ గా ఆయన చేసిన కామెంట్స్ గుబులు రేపడంతో పాటు సంచలనం రేపుతున్నాయి.

నాగ చైతన్య, సమంత విడాకుల తర్వాత ఆయన మరింత ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత నుంచి కేవలం ఆయన సెలబ్రెటీల గురించి మాత్రమే జాతకాలు చెబుతూ వస్తున్నాడు. కొత్త ఏడాది ఎలా ఉండబోతుంది.. చిత్ర పరిశ్రమలో చోటు చేసుకునే పరిణామాలపై షాకింగ్ విషయాలను చెప్పాడు. ఓ సూపర్ స్టార్‌ గురించి చెప్పిన విషయాలు సంచలనంగా మారాయి. అనారోగ్య కారణాలతో సూపర్ స్టార్ ఇండస్ట్రీకి గుడ్‌ బై చెబుతాడని చెప్పాడు. ఈ ఏడాది లేదా వచ్చే ఏడాది గానీ ఇండస్ట్రీని వీడుతాడని తెలిపారు. అయితే ఆ సూపర్‌ స్టార్‌ ఎవరో మాత్రం రివీల్ చేయలేదు. అయితే అభిమానులు మాత్రం ఇప్పటి నుంచి లెక్కలు చేసుకోవడంతో పాటు టెన్షన్ పడుతున్నారు.

మరోవైపు ఓ స్టార్‌ యాంకర్‌పై కూడా సంచలన విషయాలను తెలిపాడు. ఓ స్టార్‌ యాంకర్‌ పర్సనల్ రోడ్డున పడే పరిస్థితి వస్తుందని కామెంట్ చేశాడు. బాలీవుడ్‌ హీరోయిన్‌పై కూడా హాట్‌ కామెంట్‌ చేశాడు వేణు స్వామి. బాలీవుడ్‌ హీరోయిన్‌ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఓ సంచలన విషయం బయటకు వస్తుందని, ఆమె సంచలనాలకు కేరాఫ్‌గా మారుతుందన్నారు. అంతేకాక ఉగాది నుంచి పరిస్థితులను వేణు స్వామి వివరించాడు. వచ్చేడాది క్రోధి నామ సంవత్సరం అని.. ఈ ఏడాదికి కుజుడు రాజుగా ఉంటాడని.. మంత్రి స్థానంలో శని ఉంటాడని.. కుజుడు చేడు ప్రభావాలను చూపిస్తాడని.. శని కూడా చెడు ప్రభావాలను కలిగిస్తాడని.. మొత్తంగా వచ్చే ఏడాది మంచి కంటే చెడే ఎక్కువగా జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం వేణు స్వామి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.