Adipurush: హనుమంతుడి పక్క సీటుకు భారీ ధర.. క్లారిటీ ఇచ్చిన ఆదిపురుష్ టీమ్

దేశమంతా ఎదురుచూస్తోంది ఇప్పుడు ఆదిపురుష్‌ మూవీ గురించి ! కొందరు సినీ ప్రముఖులు భారీ ఎత్తున టికెట్లు కొనుగోలు చేసి సినిమాపై వారికున్న అభిమానాన్ని చాటుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రతి రామాలయానికి ఉచితంగా 101 టికెట్స్‌ను ఇవ్వనున్నట్లు కొన్ని మీడియా సంస్థలు ప్రకటించాయి.

  • Written By:
  • Publish Date - June 12, 2023 / 01:54 PM IST

ఈ సినిమా ప్రదర్శించే ప్రతి థియేటర్‌లో ఒక సీటుని ఆంజనేయుడి కోసం ఖాళీగా ఉంచాలని మూవీ టీమ్ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఈ ఖాళీ సీటు పక్కన ఉండే సీటు టికెట్‌కు సంబంధించి రకరకాల రూమర్లు స్టార్ట్ అయ్యాయ్. రామాయణ పారాయణం జరిగే ప్రతిచోటికీ హనుమంతుడు వస్తాడు అనే నమ్మకంతో.. ప్రతి థియేటర్లో ఒక సీటును ఖాళీగా ఉంచుతున్నారు. దీంతో కొందరు ఆ సీటు పక్క టికెట్‌ను భారీ ధరకు అమ్ముతున్నారనే ప్రచారం సాగుతోంది. ఐతే ఈ విషయంపై ఆదిపురుష్‌ నిర్మాణ సంస్థ క్లారిటీ ఇచ్చింది.

తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దంటూ ట్వీట్‌ చేసింది. హనుమంతుడి పక్క సీటు టికెట్‌ను భారీ ధరకు అమ్ముతున్నారంటూ ప్రచారంలో నిజం లేదని.. అన్నీ సీట్ల ధరకే ఆ టికెట్‌ను కూడా అమ్ముతున్నారు. దానికి ఎలాంటి ప్రత్యేకత లేదని క్లారిటీ ఇచ్చింది మూవీ టీమ్. అత్యంత భారీ బడ్జెత్‌తో రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఆదిపురుష్‌… జూన్‌ 16న విడుదల కానుంది.

ఇందులో రాముడిగా ప్రభాస్‌, సీతగా కృతిసనన్‌, రావణాసురుడిగా సైఫ్‌ అలీఖాన్‌ నటించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌, పాటలు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక అటు విజువల్స్ కూడా అదుర్స్ అనిపించే రేంజ్‌లో ఉండడంతో.. అభిమానుల్లో కొత్త క్యూరియాసిటీ మొదలైంది. త్రీడీలో ఆ విజువల్స్‌ ఎక్స్‌పీరియన్స్‌ చేసేందుకు.. ఆ అనుభవాన్ని జ్ఞాపకంగా మార్చుకునేందుకు అంతా ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు.