TOLLYWOOD: ఒక్కడిని నమ్ముకుంటే దెబ్బే.. అందుకే ఒకేసారి రెండు.. ట్రెండ్ మార్చిన మేకర్స్

పవన్‌తో హరిహర వీరమల్లు స్టార్ట్ చేశాడు క్రిష్. 2019లో మొదలైన ఈ ప్రాజెక్ట్ ఇప్పటివరకు ఫినిష్ కాలేదు. పవన్ ఈ సినిమాకి డేట్స్ ఇవ్వనప్పుడు కేవలం 40 రోజుల్లోనే వైష్ణవ్ తేజ్‌తో కొండపొలం తెరకెక్కించాడు క్రిష్.

  • Written By:
  • Publish Date - January 21, 2024 / 03:00 PM IST

TOLLYWOOD: సౌత్‌లో పెద్ద సినిమా అంటే మినిమమ్ రూ.100 కోట్లు ఖర్చు పెట్టాల్సిందే. అంత బడ్జెట్ పెడుతున్నపుడు మేకర్స్ కూడా తమ ఫోకస్‌ని దానిపైనే పెడతారు. కానీ ఆ ప్రాజెక్ట్ ఆలస్యమైతే మరో ఆప్షన్ చూసుకోక తప్పదు. ఇప్పుడు ఇదే చేస్తున్నారు కొంతమంది దర్శకులు. ఓ సినిమా సెట్స్‌పై ఉండగానే మరో ప్రాజెక్ట్‌ని రెడీ చేసేస్తున్నారు. పవన్‌తో హరిహర వీరమల్లు స్టార్ట్ చేశాడు క్రిష్. 2019లో మొదలైన ఈ ప్రాజెక్ట్ ఇప్పటివరకు ఫినిష్ కాలేదు.

Double iSmart: డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ ఎప్పుడు..? సినిమా వాయిదా పడుతుందా..?

పవన్ ఈ సినిమాకి డేట్స్ ఇవ్వనప్పుడు కేవలం 40 రోజుల్లోనే వైష్ణవ్ తేజ్‌తో కొండపొలం తెరకెక్కించాడు క్రిష్. ఇప్పుడు నయనతారతో మరో లేడీ ఓరియోంటెడ్ ప్రాజెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఉస్తాద్ భగత్ సింగ్ ఆలస్యం కారణంగా.. రవితేజతో మిస్టర్ బచ్చన్ మూవీ మొదలుపెట్టాడు హరీష్ శంకర్. 3 నెలల్లో ఈ సినిమా పూర్తి చేసేలా పక్క ప్లాన్‌ని అప్లై చేస్తున్నారు. ‘జెర్సీ’తో హిట్ కొట్టిన గౌతమ్ తిన్ననూరి.. ఆ తర్వాత చెర్రీతో ఓ ప్రాజెక్ట్ చేయాలని చూశాడు. కానీ అది వర్కౌట్ కాకపోవడంతో విజయ్ దేవరకొండతో నెక్ట్స్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. ఇప్పటికే పూజా కార్యక్రమలు జరిపాడు. కానీ రౌడీ స్టార్ సడన్‌గా పరశురామ్ దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ మూవీ స్టార్ట్ చేశాడు. దీనికోసం బల్క్ డేట్స్ కేటాయించాడు.

దీంతో గౌతమ్ మరో సినిమాకి షిఫ్ట్ అయ్యాడు. సారా అర్జున్ కీలక పాత్రలో ఓటిటి కోసం ఓ హైస్కూల్ రొమాన్స్ డ్రామా తెరకెక్కిస్తున్నాడు. లేటెస్ట్ సెన్సేషన్ ప్రశాంత్ వర్మ సైతం హనుమాన్ చేస్తూనే ఓ చిన్న సినిమాను సైలెంట్‌గా పూర్తి చేసినట్లు తెలుస్తుంది. మొత్తానికి పెద్ద సినిమా చేస్తూనే.. మధ్యలో గ్యాప్ దొరికినపుడు మరో చిన్న సినిమా తెరకెక్కిస్తున్నారు. ఒక్కరో ఇద్దరో కాదు.. ఇప్పుడందరూ అదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు.