Tollywood: హిట్ పెయిర్ కోసం దర్శకుల పాట్లు.. రిపీటవుతున్న జోడీలు..!

లవ్‌స్టోరీతో ప్రేక్షకులకు అందమైన ప్రేమకథని అందించాడు శేఖర్ కమ్ముల. 2021లో రిలీజైన ఈ మూవీ సాలిడ్ హిట్‌ని అకౌంట్‌లో వేసుకుంది. ఇందులో నాగచైతన్య, సాయిపల్లవి జోడీకి మంచి మార్కులు పడ్డాయి. రెండెళ్ల తర్వాత మళ్లీ ఇదే జంటని రిపీట్ చేయబోతున్నాడు చందు మొండేటి.

  • Written By:
  • Publish Date - October 8, 2023 / 06:34 PM IST

Tollywood: హీరో -హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ అయితే ఆ మూవీ బ్లాక్ బస్టర్ అవుతాది. ఆ జంటని మళ్లీ స్క్రీన్‌పై చూడాలని ప్రేక్షకులు కోరుకుంటారు. ఈ ఫార్ములా రిపీట్ అవ్వాలంటే కత్తిలాంటి కథ దొరకాలి. ఆ స్టోరీకి ఈ ఇద్దరినే తీసుకోవాలని డైరెక్టర్‌కి అనిపించాలి. అప్పుడే స్టార్ కాంబో రిపీట్ అవుతుంది. టాలీవుడ్‌లో ఇప్పుడు ఇదే ట్రెండ్‌ని రీస్టార్ట్ చేశారు కొంత మంది మేకర్స్. లవ్‌స్టోరీతో ప్రేక్షకులకు అందమైన ప్రేమకథని అందించాడు శేఖర్ కమ్ముల.

2021లో రిలీజైన ఈ మూవీ సాలిడ్ హిట్‌ని అకౌంట్‌లో వేసుకుంది. ఇందులో నాగచైతన్య, సాయిపల్లవి జోడీకి మంచి మార్కులు పడ్డాయి. రెండెళ్ల తర్వాత మళ్లీ ఇదే జంటని రిపీట్ చేయబోతున్నాడు చందు మొండేటి. మత్స్యకారుల జీవితాలను అవిష్కరించే విధంగా ఈ సినిమా కథ ఉంటుందట. ఈ ప్రాజెక్ట్‌కి తండెల్ అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారు. ఇందులో నాగచైతన్యకి జోడీగా సాయిపల్లవి నటించనుంది. విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో మూవీ ఫిక్స్ అయింది. ఇందులో హీరోయిన్‌గా మొదట శ్రీలీలను ఫిక్స్ చేశారు మేకర్స్. పూజా కార్యక్రమాల్లో కూడా ఆమె పాల్గోంది. కానీ వరుస సినిమాలతో డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఈ ప్రాజెక్ట్ నుంచి శ్రీలీల తప్పుకున్నట్లు టాక్. దీంతో ఆ ఫిల్మ్ టీం రష్మిక మందన్నాని సంప్రదించగా నేషనల్ క్రష్ పచ్చ జెండా ఊపినట్లు తెలుస్తోంది.

మరి ఇదే నిజమైతే విజయ్ రష్మిక కలిసి నటించనున్న మూడో సినిమా ఇదే అవుతుంది. బింబిసార సక్సెస్‌తో హిట్ పెయిర్ అనిపించుకున్న కళ్యాణ్ రామ్-సంయుక్తా మీనన్ తాజాగా డెవిల్ మూవీలో కలిసి నటిస్తున్నారు. అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ నవంబర్ 24న పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ కానుంది. అలాగే వినయ విధేయ రామతో యావరేజ్ హిట్ అందుకున్న రామ్ చరణ్-కియారా అద్వానీ సైతం గేమ్ ఛేంజర్ కోసం రెండోసారి జోడీ కట్టారు. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకు రానుంది.