Mahesh Babu: విదేశీ టూర్.. ఒకే చోట మహేష్, రామ్ చరణ్, ఎన్టీఆర్ సందడి..

క్రిస్మస్‌తో పాటు న్యూ ఇయర్ వేడుకల కోసం ఫారిన్ టూర్ ప్లాన్ చేస్తున్నాడు మహేష్ బాబు. ఈ టూర్‌లో మహేష్ బాబుతో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఫ్యామిలీతో కలిసి వెకేషన్ వెళ్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

  • Written By:
  • Publish Date - November 22, 2023 / 01:48 PM IST

Mahesh Babu: టాలీవుడ్‌లో స్టార్ హీరో మహేష్ బాబు సినిమాలకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో.. ఫ్యామిలీకి కూడా అంతే ప్రాధాన్యం ఇస్తారు. సందర్భం దొరికితే చాలు.. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తాడు. ఇక సినిమాల గ్యాప్ వచ్చిందంటే ఎంచక్కా.. ఫ్యామిలీతో కలిసి విదేశాలకు చెక్కేస్తాడు. ఏడాదికి కనీసం మూడు నుంచి ఐదు సార్లు ప్లాన్ చేసుకుని కుటుంబంతో సరదాగా గడుపుతాడు. అయితే త్వరలోనే మహేష్ తన ఫ్యామిలీతో కలిసి మరో వెకేషన్ ప్లాన్ చేశారని తెలుస్తోంది.

Bigg boss: మర్డర్ కేసు.. బిగ్ బాస్ హౌస్‌లో హత్య.. విచారిస్తున్న అర్జున్, అమర్

అయితే ఈసారి ఫ్యామిలీతో పాటు మరో ఇద్దరు స్టార్ హీరోలు యాడ్ అవ్వడం హాట్ టాపిక్‌గా మారింది. క్రిస్మస్‌తో పాటు న్యూ ఇయర్ వేడుకల కోసం ఫారిన్ టూర్ ప్లాన్ చేస్తున్నాడు మహేష్ బాబు. ఈ టూర్‌లో మహేష్ బాబుతో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఫ్యామిలీతో కలిసి వెకేషన్ వెళ్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఎప్పుడూ తన ఫ్యామిలీతో మాత్రమే వెళ్లే మహేష్ బాబు ఈసారి ఎన్టీఆర్ భార్య పిల్లలు అలాగే రామ్ చరణ్ భార్య కూతురితో కలిసి ఈ వెకేషన్ దాదాపు 7 రోజుల పాటు ప్లాన్ చేశారన్న వార్త వైరల్‌గా మారింది. సాధారణంగా ఈ ముగ్గురు హీరోలు విడివిడిగా కనబడితేనే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. అలాంటిది ముగ్గురు కలిసి ఒకేసారి, ఒకే చోటకు వెకేషన్ వెళ్లబోతున్నారు అనే విషయం తెలియడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇలా వీరంతా కలిసి ఒకే చోట కనపడబోతున్నారనే వార్త వైరల్‌గా మారడంతో ఖుషి అవుతున్నారు. ప్రస్తుతం మహేష్.. గుంటూరు కారం మూవీతో, ఎన్టీఆర్ దేవరతో, రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. త్వరలో ఈ ముగ్గురు తమ సినిమాలకు గ్యాప్ ఇచ్చి వెకేషన్‌కు వెళ్తున్నారట.