TRIVIKRAM: గురూజీ యమ డేంజర్.. అందుకే దూరం దూరం..

బన్నీ ఎందుకు త్రివిక్రమ్‌ని సైడ్ చేశాడు..? మాటల మాంత్రికుడు తెలివిగా పుష్ప 2 షూటింగ్ మధ్యలోనే తనతో సినిమా అని ఎనౌన్స్ చేసినా, బన్నీ మాత్రం ఇప్పుడు తనని సైడ్ చేస్తున్నాడట. ఈ నిర్ణయం తీసుకోవడానికి ఒక కారణం ఉంది.

  • Written By:
  • Updated On - April 1, 2024 / 06:16 PM IST

TRIVIKRAM: త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే ఇండస్ట్రీలో చాలమందికి పడదు. అందులో బండ్ల గణేష్ నుంచి హీరోయిన్ పూనం కౌర్ వరకు చాలామందికి మాటల మాంత్రికుడి మీద పీకల దాకా కోపం ఉందంటారు. కారణం పవన్‌ని తమకి దూరం చేసింది త్రివిక్రమే అనేది వాళ్ల వాదన. ఇలాంటి ప్రచారాలు ఎలా ఉన్నా, ఈ గురూజీతో యమ డేంజర్ అని అల్లు అర్జున్ నిర్ణయానికి వచ్చాడట. అందుకే అర్జెంట్‌గా త్రివిక్రమ్‌తో ప్లాన్ చేసుకున్న సినిమాను సైడ్ చేసి, అట్లీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటున్నారు.

PAWAN KALYAN: పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. ‘ఓజీ’లో సరికొత్తగా పవన్..!

అట్లీ 100 కోట్ల రెమ్యునరేషన్‌‌తోపాటు తమిళ మార్కెట్ రైట్స్‌లోవాటా అడగటంతో అల్లు అరవింద్ ఇంకా డీల్ క్లోజ్ చేయలేదని, ఇంకా చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. అట్లీ సంగతి అటుంచితే, బన్నీ ఎందుకు త్రివిక్రమ్‌ని సైడ్ చేశాడు..? మాటల మాంత్రికుడు తెలివిగా పుష్ప 2 షూటింగ్ మధ్యలోనే తనతో సినిమా అని ఎనౌన్స్ చేసినా, బన్నీ మాత్రం ఇప్పుడు తనని సైడ్ చేస్తున్నాడట. ఈ నిర్ణయం తీసుకోవడానికి ఒక కారణం ఉంది. జులాయ్, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో లాంటి హిట్లిచ్చాక కూడా త్రివిక్రమ్‌ని బన్నీ దూరం పెట్టడానికి కారణం.. పాన్ ఇండియా క్రేజ్‌ని రిస్క్‌లో పెట్టకూడదనే. త్రివిక్రమ్.. పవన్‌కి అజ్ఞాతవాసి లాంటి ప్లాప్ ఇచ్చాడు. మహేశ్‌కి గుంటూరు కారంతో షాక్ ఇచ్చాడు.

త్రివిక్రమ్ ఫోకస్ అంతా ఇప్పుడు బిజినెస్ మీదే తప్ప స్క్రిప్ట్ మీద లేదంటున్నారు. అందుకే పుష్పగా పాన్ ఇండియా హీరో అయిన బన్నీ, త్రివిక్రమ్‌ని దూరం పెట్టాడట. అల వైకుంఠపురంలో హిట్ అయినా, ఆరేంజ్ కథ వస్తే అది పాన్ ఇండియా లెవల్లో కలిసొస్తుందనుకుంటే తప్ప మాటల మాంత్రికుడికి డేట్లిచ్చే పరిస్థితి లేదని తెలుస్తోంది.