TRIVIKRAM-MAHESH BABU: మరోసారి.. గురూజీతో మళ్లీ మహేష్ బాబు..

గురూజీ మహేష్‌తో ఏకంగా పాన్ ఇండియా లెవల్లో మూవీ ప్లాన్ చేస్తున్నట్లు క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. మహేశ్ బాబు స్వయంగా త్రివిక్రమ్‌కు మాటిచ్చాడని తెలుస్తోంది. త్రివిక్రమ్‌తో కలిసి పాన్ ఇండియా సినిమా చేస్తానని చెప్పారట.

  • Written By:
  • Publish Date - January 31, 2024 / 02:14 PM IST

TRIVIKRAM-MAHESH BABU: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్- సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబో ఎంతో స్పెషల్‌గా ఉంటుంది. త్రివిక్రమ్ డైలాగ్స్‌ను మహేశ్ చెప్తుంటే ఉండే ఫీల్ చాలా హైలో ఉంటుంది. ఇప్పటికీ వీళ్లిద్దరూ కలిసి ఏకంగా మూడు సినిమాలు చేశారు. అతడు, ఖలేజా సినిమాలు ఇప్పటికీ కల్ట్ క్లాసిక్స్ అనే చెప్పాలి. తాజాగా వచ్చిన గుంటూరు కారం కూడా కమర్షియల్‌గా గట్టిగానే వర్కౌట్ అయ్యింది. ఎన్ని చెప్పుకున్నా బాక్సాఫీస్ వద్ద మాత్రం కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమా తర్వాత బయట త్రివిక్రమ్ గురించి చాలానే వార్తలు వచ్చాయి. మహేశ్‌కు దూరంగా ఉంటున్నాడని, కలవడం లేదంటూ చెప్పుకొచ్చారు.

Guntur kaaram: గెట్ రెడీ.. గుంటూరు కారం నుంచి మరో సర్‌ప్రైజ్!

కానీ, ఇప్పుడు వస్తున్న వార్తలు చూస్తే వాటికి పుల్ స్టాప్ పెట్టినట్లు అయ్యింది. ఈ కాంబో మరోసారి రిపీట్ కాబోతోంది అంటూ గట్టిగానే వార్తలు వస్తున్నాయి. గురూజీ మహేష్‌తో ఏకంగా పాన్ ఇండియా లెవల్లో మూవీ ప్లాన్ చేస్తున్నట్లు క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. మహేశ్ బాబు స్వయంగా త్రివిక్రమ్‌కు మాటిచ్చాడని తెలుస్తోంది. త్రివిక్రమ్‌తో కలిసి పాన్ ఇండియా సినిమా చేస్తానని చెప్పారట. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ వార్తపై చర్చ జరగడం మాత్రమే కాకుండా.. రూమర్స్‌కి చెక్ పెట్టినట్లు అయ్యింది. త్రివిక్రమ్ కూడా ఎప్పటి నుంచో పాన్ ఇండియా సినిమా తీసేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. అల్లు అర్జున్‌తో ఆ కల తీర్చుకోవాలని భావించారు. కానీ, అది ఇప్పట్లో వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు. ఎందుకంటే అల్లు అర్జున్ కోసం బోయపాటి, అట్లీ కుమార్ క్యూలో ఉన్నారు. బోయపాటి ఇప్పటికే అల్లు కాంపౌండ్ నుంచి సినిమా ఓకే చేయించుకున్నాడు. కాబట్టి త్రివిక్రమ్‌కు బన్నీ దొరికే ఛాన్స్ చాలా తక్కువనే చెప్పాలి. ఆ దెబ్బతో త్రివిక్రమ్ పాన్ ఇండియా కోరిక ఇంకాస్త వెనక్కు వెళ్లింది. మహేశ్ బాబు ప్రామిస్ చేసినా కూడా అది పట్టాలు ఎక్కాలంటే ఇంకో మూడేళ్లు అయినా పడుతుంది.

ఎందుకంటే మహేశ్ ప్రస్తుతం రాజమౌళి కోసం దాదాపు మూడేళ్లు డేట్స్ లాక్ చేసేందుకు రెడీ అయిపోయాడు. కాబట్టి మహేశ్ ఓకే చెప్పినా కూడా త్రివిక్రమ్ పాన్ ఇండియా సినిమా పట్టాలెక్కాలంటే ఆలస్యం అవ్వక తప్పదు. ఈలోపు త్రివిక్రమ్ కూడా ఓ మల్టీ స్టారర్ తెరకెక్కించే పనిలో పడ్డారని చెబుతున్నారు. న్యాచురల్ స్టార్ నాని-వెంకటేశ్ కాంబోలో త్రివిక్రమ్ మూవీ ఉండబోతోంది అని చెబుతున్నారు. ఇప్పటికే నాని కూడా ఓకే చెప్పాడని టాక్ ఉంది. మరి.. త్రివిక్రమ్ తన పాన్ ఇండియా సినిమాని ఏ హీరోతో ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.