Vijay Antony: వాళ్లను మిస్ అవుతాను.. విజయ్ ఆంటోని కూతురు చివరి లెటర్‌లో సంచలనాలు..

మీరా మరణంతో కోలీవుడ్‌లో విషాద చాయలు అలుముకున్నాయ్. 20 ఏళ్ల కెరీర్‌లో ఎలాంటి వివాదం లేకుండా, చాలా అణ‌కువ‌తో ఉండే హీరో విజ‌య్ ఆంటోనీ.. కుమార్తెను కోల్పోవడం అంద‌రినీ బాధకు గురి చేస్తోంది. మీరా మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

  • Written By:
  • Publish Date - September 21, 2023 / 03:23 PM IST

Vijay Antony: బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయిన హీరో విజయ్ ఆంటోని. మ్యూజిక్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత హీరోగా తెరంగేట్రం చేశాడు. మంచి కథాబలం ఉన్న సినిమాలతో దూసుకుపోతున్నారు. తమిళ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. అలాంటి విజయ్ ఆంటోని ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. విజ‌య్ కూతురు మీరా బలవన్మరణానికి పాల్పడడం.. ప్రతీ ఒక్కరిని కలిచివేస్తోంది. ఇంటర్ సెకండ్ ఇయర్ చ‌దువుతున్న మీరా.. ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయింది.

మీరా మరణంతో కోలీవుడ్‌లో విషాద చాయలు అలుముకున్నాయ్. 20 ఏళ్ల కెరీర్‌లో ఎలాంటి వివాదం లేకుండా, చాలా అణ‌కువ‌తో ఉండే హీరో విజ‌య్ ఆంటోనీ.. కుమార్తెను కోల్పోవడం అంద‌రినీ బాధకు గురి చేస్తోంది. మీరా మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మీరా మరణంతో విజయ్ ఆంటోనీ బాధను ఆపడం ఎవరితరం కావడం లేదు. పోస్ట్‌మార్టం తర్వాత మీరా భౌతికకాయాన్ని విజయ్ దంపతులు ఇంటికి తరలించారు. మీరాను చివరిసారి చూసేందుకు.. తమిళ ఇండస్ట్రీ ప్రముఖులు విజయ్ నివాసానికి తరలివస్తున్నారు. విజయ్‌ను ఓదారుస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్ తమ అభిమాన హీరోకు ధైర్యం చెప్తూ పోస్టులు పెడుతున్నారు. మీడియాతో చాలా త‌క్కువగా మాట్లాడే విజ‌య్ ఆంటోనీ.. గతంలో ఆత్మహ‌త్యకు వ్యతిరేకంగా అవ‌గాహ‌న కలిగించే కార్యక్రమాలకు ప్రచారకర్తగా పాల్గొన్నారు.

అప్పుడు మాట్లాడిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయ్. ఐతే ఆయన కుమార్తె అలా చేసుకోవడం అందరినీ వేదనకు గురిచేస్తోంది. మీరా మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మీరా స్కూల్, ఆమె ఫ్రెండ్స్‌ను విచారించారు. మీరా ల్యాప్‌టాప్‌తో పాటు ఆమె ఉపయోగించే వస్తువులను పరిశీలిస్తున్నారు. కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయ్. చనిపోవడానికి ముందురోజు రాత్రి 11 గంటల వరకు మీరా.. తన ల్యాప్‌టాప్‌ ఉపయోగించిందని.. ఆ తర్వాత ఉరివేసుకుందని తెలుస్తోంది. అయితే ఈ విషయం తెల్లవారుజామున వెలుగులోకి వచ్చింది. మీరా స్కూల్‌బుక్‌లో ఒక లెటర్ దొరికిందని తెలుస్తోంది. ఆ లెటర్‌లో మీరా తన ఫ్రెండ్స్, టీచర్లును మిస్ అవుతున్నానని రాసుకొచ్చినట్లు సమాచారం. అందరూ క్షేమంగా ఉండాలి.. సంతోషంగా ఉండండి. లవ్ యూ ఆల్.. థాంక్యూ ఆల్.. అని రాసినట్టు తెలుస్తోంది.