Vijay-prashanth neel: విజయ్ దేవరకొండ – ప్రశాంత్ నీల్ క్రేజీ కాంబో నిజమేనా..?

గౌతమ్ తిన్ననూరితో ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్నాడు రౌడీ హీరో. ఇలాంటి టైమ్‌లో పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలుసుకోవడం హాట్‌టాపిక్‌గా మారింది.

  • Written By:
  • Publish Date - April 24, 2024 / 11:59 AM IST

Vijay-prashanth neel:ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ తన రేంజ్ విజయాన్ని నమోదు చేయలేకపోయాడు. దీంతో… తన నెక్స్ట్ మూవీతో అయినా తన రేంజ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరితో ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్నాడు రౌడీ హీరో. ఇలాంటి టైమ్‌లో పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలుసుకోవడం హాట్‌టాపిక్‌గా మారింది.

Superstar Rajinikanth: సూపర్ స్టార్ మాస్ అవతార్.. కూలీగా రజినీ

వీరిద్దరి కాంబోలో ఓ మూవీ రాబోతోందంటూ రూమర్లు స్ప్రెడ్ అయ్యాయి. దీని అప్‌డేట్‌పై మూవీ లవర్స్‌ ఎంతో ఎగ్జైటింగ్‌గా ఎదురు చూసారు. అయితే ఈ క్రేజీ న్యూస్ కు సంబంధించి ఇప్పుడు ఓ క్లారిటీ వచ్చింది. కెజిఎఫ్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తో విజయ్ దేవరకొండ ఒక మూవీ చేయనున్నారనే న్యూస్ పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయ్యింది. విజయ్ దేవరకొండ ఇంటికి ప్రశాంత్ నీల్ అతిథిగా వెళ్లారని టాక్ వినిపించింది. విజయ్ దేవరకొండ మేనేజర్ తో ప్రశాంత్ నీల్ ఉన్న ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే వీరి మీటింగ్ పై ఎలాంటి క్లారిటీ రానప్పటికీ.. విజయ్ ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ రాబోతుందంటూ ఓ న్యూస్ విపరీతంగా వైరల్‌గా మారింది. వీరిద్దరి మధ్య మూవీ కథకు సంబంధించిన చర్చలు జరిగాయని వార్తలు వైరల్ అయ్యాయి.

దీంతో.. రౌడీ హీరో ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. అయితే ఈ వార్తల్లో ఏ మాత్రం వాస్తవం లేదని, వారిద్దరి కలయిక సాధారణంగానే జరిగిందని విజయ్ టీమ్ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సలార్ 2 ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉనన ప్రశాంత్ నీల్ ఒక ముఖ్యమైన పని మీద హైదరాబాద్ వచ్చారు. ఆ సందర్బంలో చాలా క్యాజువల్‌గా విజయ్‌ను కలిసారని సమాచారం. వీరిద్దరి కాంబోలో మూవీ రాబోతోందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. వారిద్దరి కలయిక సాధారణంగానే జరిగిందని విజయ్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. గతేడాది సలార్ సినిమాతో ప్రభాస్ ఖాతాలో బ్లాక్ బస్టర్ అందించిన నీల్.. ఇప్పుడు సెకండ్ పార్ట్ స్టార్ట్ చేసే పనిలో బిజీగా ఉన్నారని.. ప్రస్తుతం ఆయన కాన్‌సెన్‌ట్రేషన్‌ అంతా దాని మీదనే ఉందని ప్రశాంత్ నీల్ టీమ్ క్లారిటీ ఇచ్చింది.. సో.. మొత్తానికి ఈ క్రేజీ కాంబో మూవీపై వస్తున్న రూమర్లకు చెక్ పడినట్లే అన్నమాట.