కష్టాల్లో ఉన్నప్పుడు ఆ సినిమా 100 సార్లు చూసా… స్టార్ హీరోను పొగిడిన స్టార్ ఆర్టిస్ట్..

మహేష్ బాబు నటించిన అతడు సినిమా ఎంట్రీ నుంచి క్లైమాక్స్ వరకు తనకు గుర్తుంటుంది అని చెప్పాడు విజయ్ సేతుపతి

  • Written By:
  • Updated On - August 12, 2024 / 03:03 PM IST

ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి ఇప్పుడు మళ్ళీ ఫాంలోకి వచ్చేసాడు. కొన్నాళ్ళు ఇబ్బందులు పడినా వరుస ఆఫర్లతో ఈ విలక్షణ నటుడు దూసుకుపోతున్నాడు. భారీ ప్రాజెక్ట్ లకు సైన్ చేస్తూ కెరీర్ లో పీక్ స్టేజి లో ఉన్నాడు ఈ హీరో. బాలీవుడ్ సినిమాలకు కూడా సైన్ చేస్తూ అక్కడ విలన్ పాత్రలు కూడా చేసేస్తున్నాడు. ఇటీవల వచ్చిన మహారాజా సినిమాతో విజయ్ సేతుపతి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఆ సినిమాలో సేతుపతి నట బీబత్సం ఒక రేంజ్ లో ఉంటుంది.

ఒక్కో సీన్ లో జీవించేసాడు అనే చెప్పాలి ఈ హీరో. ఇప్పుడు తెలుగులో ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ సహా పలువురు హీరోలకు విలన్ పాత్రల్లో కనపడే ప్రయత్నం చేస్తున్నట్టు కధనాలు వస్తున్నాయి. విజయ్ సేతుపతి రెమ్యునరేషన్ విషయంలో భారీగా డిమాండ్ చేయకుండా కాస్త వెనకడుగు వేసి సినిమాలకు సైన్ చేస్తున్నట్టు కృష్ణా నగర్ వర్గాలు అంటున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ హీరో ఒక తెలుగు సినిమా అంటే తనకు పిచ్చి అని చెప్పుకొచ్చాడు. మహేష్ బాబు నటించిన అతడు సినిమా ఎంట్రీ నుంచి క్లైమాక్స్ వరకు తనకు గుర్తుంటుంది అని చెప్పాడు.

తాను కష్టాల్లో ఉన్నప్పుడు ఆ సినిమాను రిపీట్ మోడ్ లో చూసా అని చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో భావోద్వేగాలను దర్శకుడు త్రివిక్రమ్ చాలా అద్భుతంగా చూపించారని కొనియాడాడు. మహేష్, త్రిషల మధ్య రోమాన్స్ కూడా చాలా బాగుందని ఇక బ్రహ్మానందం కామెడి సన్నివేశాలు తనకు చాలా ఇష్టం అని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే మా హీరో సినిమాలో మంచి రోల్ చేసేయ్ బాస్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.