Virupaksha: విరూపాక్ష డైరెక్టర్‌కు భయంకరమైన వ్యాధి.. ఐదేళ్లకు మించి బతకడా?

విరూపాక్ష సినిమా ప్రమోషన్స్‌లో ఏర్పాటు చేసిన ఓ ఈవెంట్‌లో డైరెక్టర్‌ కార్తీక్‌ దండు గురించి సంచలన విషయాలు చెప్పాడు డైరెక్టర్‌ సుకుమార్‌. కార్తీక్‌ ఓ భయంకరమై వ్యాదితో బాధపడుతున్నాట. 5 ఏళ్లకు మించి ఎక్కువ బతకడని డాక్టర్లు చెప్పేశారట.

  • Written By:
  • Updated On - April 17, 2023 / 12:22 PM IST

Virupaksha: యువ హీరో సాయి ధరమ్‌ తేజ్‌, సంయుక్త మీనన్‌ హీరో హీరోయిన్లుగా వస్తున్న విరూపాక్ష సినిమా ఈ నెల 21న రిలీజ్‌ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో ఏర్పాటు చేసిన ఓ ఈవెంట్‌లో డైరెక్టర్‌ కార్తీక్‌ దండు గురించి సంచలన విషయాలు చెప్పాడు డైరెక్టర్‌ సుకుమార్‌. కార్తీక్‌ ఓ భయంకరమై వ్యాదితో బాధపడుతున్నాట.

5 ఏళ్లకు మించి ఎక్కువ బతకడని డాక్టర్లు చెప్పేశారట. కార్తీక్‌ తన దగ్గర అసిస్టెంట్‌గా పని చేస్తున్న రోజుల్లోనే ఈ వ్యాధి గురించి తెలిసిందని చెప్పాడు సుకుమార్‌. కార్తీక్‌ చనిపోతాడని అంతా అనుకున్నారట. కానీ టాలీవుడ్‌లో మంచి డైరెక్టర్‌గా పేరు తెచ్చుకోవాలనేది కార్తీక్‌ డ్రీం. ఓ మంచి సినిమా తీసి చనిపోదామనుకున్నాడట. ప్రాణాన్ని నిలబెట్టుకునేందుకు స్టెరాయిడ్స్‌ తీసుకునేవాడట. అదే టైంలో కార్తీక్‌ సుకుమార్‌కు విరూపాక్ష కథ చెప్పాడట. వినగానే ఎంతో నచ్చడంతో వెంటనే ప్రొడ్యూసర్‌ బాపినీడుతో మాట్లాడి సాయి ధరమ్‌ తేజ్‌కు కథ చెప్పించాడట సుకుమార్‌. తేజ్‌కు కూడా కథ బాగా నచ్చడంతో సినిమా ఓకే చేశాడు.

ఒక పక్క వ్యాధితో బాధ పడుతూనే సినిమాను కార్తీక్‌ అద్భుతంగా తీశాడని ప్రశంసించాడు సుకుమార్‌. కేవలం కార్తీక్‌ వాళ్ల అమ్మ ప్రార్థనలే అతని ప్రాణాలు నిలుపుతున్నాయని చెప్పాడు. కార్తీక్‌ జీవితంలో ఇది ఫస్ట్ సినిమా అయినప్పటికీ బెస్ట్‌ సినిమాగా నిలుస్తుందన్నాడు సుకుమార్‌. అటు సాయి ధరమ్‌ తేజ్‌ కూడా ఈ సినిమా చాలా స్పెషల్‌. యాక్సిడెంట్‌ నుంచి రికవర్‌ అయిన తరువాత తేజ్‌ నుంచి తీస్తున్న మొదటి సినిమా ఇది. దీంతో ఈ సినిమా మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయి. ఈ నెల 21న థియేటర్స్‌లో రిలీజ్‌ కాబోతున్న ఈ సినిమా ఆడియన్స్‌ను ఏ రేంజ్‌లో ఆకట్టుకుంటుందో చూడాలి మరి.