Virupaksha: విరూపాక్ష సీక్వెల్ షురూ.. హీరో మారిపోయాడా ఏంటి..?

సాయిధరమ్‌ తేజ్ కెరీర్‌లోనే విరూపాక్ష బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మిస్టికల్ థ్రిల్లర్.. బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపింది. విరూపాక్షకు సీక్వెల్‌ ఉంటుందని హింట్ ఇచ్చిన డైరెక్టర్‌.. ఇప్పుడు ఆ పనిలో బిజీగా ఉన్నాడు.

  • Written By:
  • Publish Date - August 14, 2023 / 04:25 PM IST

Virupaksha: విరూపాక్ష మూవీతో సాయి ధరమ్‌ తేజ్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌ గ్రాండ్‌గా స్టార్ట్ అయింది. ఎప్పటి నుంచో హిట్ కోసం ప్రయత్నాలు చేస్తుంటే.. చేతబడి కథ.. సక్సెస్‌ను ఇంటికి మోసుకొచ్చింది. సాయిధరమ్‌ తేజ్ కెరీర్‌లోనే విరూపాక్ష బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మిస్టికల్ థ్రిల్లర్.. బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపింది. వాల్డ్‌వైడ్‌గా వంద కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

విరూపాక్షకు సీక్వెల్‌ ఉంటుందని హింట్ ఇచ్చిన డైరెక్టర్‌.. ఇప్పుడు ఆ పనిలో బిజీగా ఉన్నాడు. సీక్వెల్‌కు సంబంధించి సాలిడ్ అప్‌డేట్ ఇచ్చింది మూవీ టీమ్‌. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా.. ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు అధికారికంగా వెల్లడించాయి. సీక్వెల్‌కు సంబంధించిన పోస్టర్‌ను కూడా రిలీజ్‌ చేశారు. విరూపాక్ష సీక్వెల్ ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయని.. వీలైనంత త్వరలో సినిమా సెట్స్ మీదకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామని అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు సంబంధించి యాక్టర్లు, టెక్నికల్‌ టీమ్‌ వివరాలు.. త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. మరి ఈ మూవీలో హీరోగా సాయి ధరమ్ తేజ్ యాక్ట్ చేస్తాడా.. లేదంటే మరో హీరోను సెలక్ట్ చేసుకుంటారా అని తేలాల్సి ఉంది. అసలు ఇది విరూపాక్షకు సీక్వెలేనా.. కాదా అన్నది కూడా డౌటే.

టీమ్‌ ఆఫ్ విరూపాక్ష బ్యాక్ అన్నారు కానీ.. విరూపాక్ష ఈజ్ బ్యాక్ అనలేదు. సో ఇది కొత్త కదా.. హీరో వేరే ఉంటాడా అనే డిస్కషన్ మొదలైంది అభిమానుల్లో. ఏమైనా మిథికల్ థ్రిల్లర్ అంటూ టీమ్ రిలీజ్ చేసిన పోస్టర్ మాత్రం కేక పుట్టిస్తోంది. ముగ్గురు తాళ్లతో వేలాడుతున్నారు. ఆ ముగ్గురు ఎవరా అని డీకోడ్ చేసే పనిలో ఉన్నారు అభిమానులు.