Vishnu Manchu: కన్నప్ప షూటింగులో మంచు విష్ణుకు గాయాలు..

చిత్ర షూటింగ్‌లో కథానాయకుడు మంచు విష్ణు గాయపడ్డారు. ఆయనకు స్వల్ప గాయాలైనట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. న్యూజిలాండ్ షెడ్యూల్‌లో ఒక యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా, డ్రోన్ కెమెరా అదుపుతప్పి విష్ణు మీదకు దూసుకొచ్చింది.

  • Written By:
  • Publish Date - October 29, 2023 / 08:36 PM IST

Vishnu Manchu: మంచు విష్ణు కథానాయకుడిగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం కన్నప్ప. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ న్యూజిలాండ్‌లో జరుగుతోంది. అయితే, చిత్ర షూటింగ్‌లో కథానాయకుడు మంచు విష్ణు గాయపడ్డారు. ఆయనకు స్వల్ప గాయాలైనట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. న్యూజిలాండ్ షెడ్యూల్‌లో ఒక యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా, డ్రోన్ కెమెరా అదుపుతప్పి విష్ణు మీదకు దూసుకొచ్చింది.

దీంతో విష్ణు చేతికి గాయాలయ్యాయి. ఈ ఘటనతో చిత్ర షూటింగ్ తాత్కాలికంగా నిలిపి వేశారు. ప్రస్తుతం విష్ణుకు అక్కడ చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై విష‌్ణు ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. గతంలో కూడా పలు సినిమాల షూటింగుల సందర్భంగా విష్ణు గాయపడ్డారు. కన్నప్ప చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్‌లో చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో పాన్ ఇండియన్ హీరో ప్రభాస్, మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్, శాండల్ వుడ్ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ వంటి వారు నటిస్తున్నారు. బుల్లితెరపై మహాభారతం సీరియల్‌ను తీసిన ముఖేష్ కుమార్ సింగ్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శివ భక్తుడైన కన్నప్ప కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ మూవీలో కన్నప్పగా మంచు విష్ణు కనిపించబోతున్నారు.

ఈ మూవీకి సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయి మాధవ్, తోట ప్రసాద్ వంటి వారు రచనా సహకారం అందించారు. ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.