Guntur Kaaram: గుంటూరు కారంలో అసలు హీరోయిన్‌ ఎవరు.. ఫ్యాన్స్‌లో కన్ఫ్యూజన్..!

ఏమైందో ఏమో కానీ కొన్ని రోజుల క్రితం పూజను కాదని ఈ సినిమాలో సంయుక్త మీనన్‌ను హీరోయిన్‌గా ఫైనల్‌ చేసినట్టు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పడు సంయుక్తను కూడా కాదని మరో పేరు తెర మీదకు వచ్చింది.

  • Written By:
  • Publish Date - June 24, 2023 / 11:21 AM IST

Guntur Kaaram: మహేష్‌ బాబు త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న గుంటూరు కారం సినిమా హీరోయిన్‌ విషయంలో ఆడియన్స్‌ చాలా కన్ఫ్యూజ్‌ అవుతున్నారు. కేవలం ఆడియన్స్‌ మాత్రమే కాదు.. మేకర్స్‌ కూడా తికమకలోనే ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఫస్ట్‌ ఈ సినిమాలో పూజా హెగ్దేను హీరోయిన్‌ అనుకున్నారు. ఆమె పేరు ఎనౌన్స్‌ చేసి షూటింగ్‌ స్టార్ట్‌ చేశారు.

ఏమైందో ఏమో కానీ కొన్ని రోజుల క్రితం పూజను కాదని ఈ సినిమాలో సంయుక్త మీనన్‌ను హీరోయిన్‌గా ఫైనల్‌ చేసినట్టు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పడు సంయుక్తను కూడా కాదని మరో పేరు తెర మీదకు వచ్చింది. హిట్‌-2 సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన మాజీ మిస్‌ ఇండియా మీనాక్షి చౌదరిని హీరోయిన్‌గా ఫైనల్‌ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయాలేవీ ఇప్పటి వరకూ మూవీ టీం ఎనౌన్స్‌ చేయకపోవడం అందరినీ కన్ఫ్యూజన్‌కు గురి చేస్తోంది.

పూజను ఫైనల్‌ చేసిన తరువాత మళ్లీ సంయుక్తను తీసుకురావాల్సిన అవసరం ఏంటి..? ఒక వేళ సంయుక్త మీనన్‌ వచ్చినా ఇప్పుడు మళ్లీ మీనాక్షి చౌదరిని ఎందుకు తీసుకున్నారంటున్నారు ఆడియన్స్‌. ఈ కన్ఫ్యూజన్‌కు తెర దించుతూ ఈ విషయంలో మేకర్స్‌ ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.