Yathra 2: ఎన్నికల కోసం మరో సినిమా రెడీ చేసిన జగన్‌.. ఎలక్షన్స్‌కు ముందే యాత్ర-2 రిలీజ్‌..

ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి బయోపిక్‌ తెరకెక్కబోతోందంటూ చాలా కాలం నుంచి వార్తలొస్తున్నాయి. ఎట్టకేలకు ఈ సినిమా కొన్ని రోజుల్లోనే పట్టాలెక్కబోతోంది. డైరెక్టర్‌ మహి.వి.రాఘవ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. యాత్ర పేరుతో వచ్చిన వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి బయోపిక్‌కు కూడా రాఘవ్‌ దర్శకత్వం వహించాడు. గత ఎన్నికలకు ముందు రిలీజైన యాత్ర సినిమా వైఎస్‌ అభిమానులకు ఆకట్టుకుంది. ఇప్పుడు అదే తరహాతో యాత్ర-2 పేరుతో సినిమా తీయబోతున్నాడు రాఘవ్‌.

  • Written By:
  • Publish Date - May 5, 2023 / 01:45 PM IST

ఈ సినిమాలో జగన్‌ పాత్రలో తమిళ్‌ హీరో జీవా నటించబోతున్నట్టు సమాచారం. నిజానికి జగన్‌ రోల్ గురించి చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. మొదట్లో ఈ క్యారెక్టర్‌ కోసం సూర్యను అనుకున్నారట. కానీ అది వర్కౌట్‌ కాకపోవడంతో.. స్కామ్‌ 1992 ఫేమ్‌ ప్రతీక్‌ గాంధీతో జగన్‌ రోల్‌ చేయించాలని ప్లాన్‌ చేశారట. కానీ ఇప్పుడు మాత్రం జీవా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. దీనిపై అధికారికంగా ఎలాంటి ఎనౌన్స్‌మెంట్‌ లేకపోయినా.. దాదాపు అన్ని పనులు పూర్తైనట్టు సమాచారం.

ఈ సినిమాలో జగన్‌ పొలిటికల్‌ ఎంట్రీ నుంచి సీఎం అయ్యే వరకూ ఆయన జీవితంలో జరిగిని అన్ని విషయాలు, పాదయాత్ర స్పెషల్‌గా చూపించబోతున్నారట. దీనికి సంబంధించిన స్క్రిప్ట్‌ కూడా రెడీ చేశాడట రాఘవ. త్వరలోనే సినిమా షూటింగ్‌ కూడా ప్రారంభించబోతున్నామని రీసెంట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పాడు.

2024 ఎన్నికలకు ముందు సినిమాను కంప్లీట్‌ చేసి రిలీజ్‌ చేసేలా ప్లాన్‌ చేస్తున్నారట. పోయినసారి కూడా సరిగ్గా ఎన్నికల ముందు రాజశేఖర్‌ రెడ్డి యాత్ర సినిమా రిలీజ్‌ చేశారు. ఎలక్షన్స్‌కు ఆ సినిమా ఒకింత ప్లస్‌ అయ్యింది. ఇప్పుడు యాత్ర-2 సినిమా కూడా సరిగ్గా ఎలక్షన్స్‌కు ముందు రిలీజైతే ఎన్నికలకు ఉపయోగపడుంతుంది అనే క్యాలిక్యులేషన్‌లో మూవీ మేకర్స్‌ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక అప్‌డేట్‌ ఎప్పుడు వస్తుందో చూడాలి.