Pre-Wedding : సముద్రంలో అనంత్‌ ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు.. క్రూయిజ్‌ మొత్తంలో ఇదే హైలెట్‌

అంబానీ (Ambani family) ఇంట్లో పెళ్లి వేడుక అంటే ఏ రేంజ్‌లో ఉంటుందో ఇప్పటికే ప్రపంచం చూసేసింది. చాలా కాలం తరువాత అంబానీ ఇంట్లో పెళ్లి భాజాలు మోగుతుండటంతో అనంత్‌ అంబానీ పెళ్లి వేడుకను ప్రపంచం గుర్తుంచుకునేలా చేస్తున్నారు అంబానీ.

అంబానీ (Ambani family) ఇంట్లో పెళ్లి వేడుక అంటే ఏ రేంజ్‌లో ఉంటుందో ఇప్పటికే ప్రపంచం చూసేసింది. చాలా కాలం తరువాత అంబానీ ఇంట్లో పెళ్లి భాజాలు మోగుతుండటంతో అనంత్‌ అంబానీ పెళ్లి వేడుకను ప్రపంచం గుర్తుంచుకునేలా చేస్తున్నారు అంబానీ. ఇప్పటికే జామ్‌ నగర్‌లో ప్రీ వెడ్డింగ్‌ పార్టీతో మిలియనీర్ల మైండ్‌ పోగొట్టారు. ఇప్పుడు మరో పార్టీకి రెడీ అయ్యారు. అనంత్‌ అంబానీ రాధిక మర్చంట్‌ల సెకండ్‌ ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈసారి వేడుకలను భూమీ మీద కాకుండా సముద్రంలో నిర్వహిస్తున్నారు. టెర్రా అండ్‌ మేర్‌ పేరుతో ఈ ఈవెంట్‌ నిర్వహిస్తున్నారు. అంటే భూమి, సముద్రం అని అర్థం. మొదటి ప్రీ వెడ్డింగ్‌ భూమి మీద జరిగింది కాబట్టి సెకండ్‌ ప్రీ వెడ్డింగ్‌ నీళ్ల మీద జరిపించడమే ఈ థీమ్‌ ఉద్దేశం.

ఇందుకోసం 7 వేల కోట్ల విలువ చేసే క్రూయిజ్‌ షిప్‌ను బుక్‌ చేశారు. ఈ షిప్‌ ఇటలీ నుంచి ఫ్రాన్స్‌ మధ్య 4 వేల కిలో మీటర్లు ప్రయాణించనుంది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ వేడుకకు మరోసారి బాలీవుడ్‌ ప్రముఖులు, బిజినెస్‌ మ్యాన్స్‌ హాజరయ్యారు. ఇప్పటికే బాలీవుడ్‌ బ్యూటీస్‌, హీరోస్‌ అంతా క్రూయిజ్‌కు చేరుకున్నారు. వీళ్ల కోసం నాలుగు రోజుల పాటు షిప్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అంబానీ. ఈ గ్రాండ్ పార్టీలో రణబీర్ కపూర్, ఆలియా భట్, సల్మాన్ ఖాన్, ఎంఎస్ ధోనీ, షారూఖ్ ఖాన్ లాంటి దాదాపు 800 మంది దేశ విదేశీ ప్రముఖులు పాల్గొననున్నారు. అతిథులకు సేవ చేయడానికి షిప్‌లో దాదాపు 600 మంది స్టాఫ్ అందుబాటులో ఉంటారు.
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల రెండవ ప్రీ-వెడ్డింగ్ బాష్ చాలా గ్రాండ్‌గా ప్రారంభలయ్యింది. గెస్ట్‌లు రోమ్‌లో దిగి , క్రూయిజ్‌లో టోగా పార్టీతో ఈవెంట్‌ ప్రారంభించారు. ఒక ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో ఉండే అన్ని వసతులను గెస్ట్‌ల కోసం ఈ షిప్‌లో ఏర్పాటు చేశారు. ఇవాళ ప్రారంభమైన ఈ ఈవెంట్‌ ఫ్రాన్స్‌లో జూన్‌ 1న ముగుస్తుంది. ఫస్ట్‌ ప్రీ వెడ్డింగ్‌ను జామ్‌ నగర్‌లో పండగలా నిర్వహించిన అంబానీ.. సెకండ్‌ ప్రీ వెడ్డింగ్‌ను ఖండాలు దాడి మరీ నిర్వహిస్తున్నారు.