Animal : యానిమల్‌ నిర్మాత కూతురు హఠాన్మరణం..

చిత్ర పరిశ్రమను విషాదాలు వెంటాడుతున్నాయ్. కార్తి సర్దార్‌ 2 మూవీ షూటింగ్‌లో ప్రమాదవశాత్తు.. స్టంట్‌మెన్ చనిపోయిన ఘటన మర్చిపోకముందే.. ప్రముఖ నిర్మాత కూతురు కన్నుమూశారు.

 

 

చిత్ర పరిశ్రమను విషాదాలు వెంటాడుతున్నాయ్. కార్తి సర్దార్‌ 2 మూవీ షూటింగ్‌లో ప్రమాదవశాత్తు.. స్టంట్‌మెన్ చనిపోయిన ఘటన మర్చిపోకముందే.. ప్రముఖ నిర్మాత కూతురు కన్నుమూశారు. సందీప్‌ రెడ్డి వంగ డైరెక్షన్‌లో.. రణ్‌బీర్‌ కపూర్ హీరోగా వచ్చిన యానిమల్ మూవీ నిర్మాతల్లో ఒకరైన కృషన్ కుమార్ కుమార్తె కన్నుమూసింది. 20ఏళ్లకే క్యాన్సర్‌తో పోరాడుతూ మరణించింది. ఈ విషయం తెలిసి ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

కృషన్‌ కుమార్‌ నిర్మాణ సంస్థ అయిన టీ సిరీస్ కూడా ఆమె మరణవార్తని ధ్రువీకరించింది. బాలీవుడ్‌లోనే బడా నిర్మాణ సంస్థ టీ సిరీస్. ప్రస్తుతం దీన్ని భూషణ్ కుమార్ చూసుకుంటున్నారు. ఈయనకు చిన్నాన్న కృషన్ కుమార్. ప్రస్తుతం కృషన్.. టీ సిరీస్ ఛైర్ పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. 1995లో బేవఫా సనమ్ అనే సినిమాలో నటించిన ఈయన.. ఆ తర్వాత పూర్తిగా నిర్మాణ వ్యవహారాలకే పరిమితమైపోయారు. గతేడాది వచ్చిన యానిమల్ నిర్మాతల్లో ఈయన కూడా ఒకరు.

కృషన్ కుమార్‌కి ఒకే ఒక్క కూతురు త్రిష కుమార్. ప్రస్తుతం ఈమెకు 20 ఏళ్లు. కానీ ఊహించని విధంగా క్యాన్సర్ బారిన పడిన ఈమెకు జర్మనీలో అత్యాధునిక చికిత్స అందించారు. ఐతే వైద్యులు ఈమెని కాపాడలేకపోయారు. జూలై 18న త్రిష తుది శ్వాస విడిచింది. మరీ చిన్న వయసులోనే ఇలా క్యాన్సర్‌తో త్రిష చనిపోవడం బాధాకరమైన విషయం అంటూ.. నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 20ఏళ్లకే వందేళ్లు నిండిపోయాయా అంటూ కన్నీళ్లు కారుస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖులంతా.. కృషన్‌కుమార్‌కు సంఘీభావం తెలుపుతున్నారు.