bandla ganesh : మరో వివాదం.. రూ.75 కోట్ల ఇంటిని కబ్జా చేశాడు

కొద్దిరోజులుగా సినీ నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) పై అభియోగాలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.. ఈ క్రమంలోనే మరోసారి బండ్ల గణేష్‌ మరో కొత్త వివాదంలో చిక్కుకున్నాడు.. ఇప్పటికే ఓ చెక్ బౌన్స్ కేసులో ఓ సంవత్సర కాలం జైలు శిక్ష పడగా.. ఇప్పుడు ఇల్లు కబ్జా వివాదాంలో ఇరుక్కున్నాడు..

కొద్దిరోజులుగా సినీ నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) పై అభియోగాలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.. ఈ క్రమంలోనే మరోసారి బండ్ల గణేష్‌ మరో కొత్త వివాదంలో చిక్కుకున్నాడు.. ఇప్పటికే ఓ చెక్ బౌన్స్ కేసులో ఓ సంవత్సర కాలం జైలు శిక్ష పడగా.. ఇప్పుడు ఇల్లు కబ్జా వివాదాంలో ఇరుక్కున్నాడు.. బండ్ల గణేష్ 75 కోట్ల రూపాయల అద్దె ఆస్తిని అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారని, తనపై తప్పుడు కేసు పెట్టారని హీరా గ్రూప్ చైర్‌పర్సన్ నౌహెరా షేక్ ఆరోపించారు.. ఈ విషయం ఇప్పుడు టాలీవుడ్‌లో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది..

75 కోట్ల విలువ చేసే తన ఇంటిని అద్దెకు ఇవ్వగా.. కబ్జా చేసేందుకు బండ్ల గణేశ్‌ స్కెచ్‌ వేసాడని నౌహీర్ షేక్ ఆరోపించారు. తన ఇంట్లో అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారని సమాచారం రావటంతో.. వాస్తవాలు తెలుసుకునేందుకు వెళ్లగా తమపై రౌడీలతో దాడి చేయించారని తెలిపారు., ఈడీ ఆస్తులను అటాచ్ చేసిందని తెలుసుకున్న గణేష్, ఇంటి మొత్తాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించి, తనను వేధించాడని ఆమె ఆరోపించారు..

ఇంటిపై మొదట పదకొండు నెలల రెంట్‌ అగ్రిమెంట్‌ చేసుకోగా.. ఆ తర్వాత ఖాళీ చేయాలని చెప్పినట్టుగా నౌహీరా షేక్ తెలిపారు. అయితే.. అప్పటి నుంచి ఖాళీ చేయకుండా అందులోనే ఉన్నారని, ఖాళీ చేయాలని అడిగితే ఇలా దాడికి పాల్డడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాండ్ పేపర్లను కూడా బండ్ల గణేశ్‌ ఫోర్జరీ చేశాడని, దీనిపై తమ దగ్గర ఉన్న సుప్రీం కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ.. వాటిని పోలీసులు పట్టించుకోలేదన్నారు. ఈ వివాదంపై ఫిలింనగర్‌ పోలీసుల తీరుపై డీజీపీకి ఫిర్యాదు చేయనున్నట్టు నౌహీరా షేక్ తెలిపారు.. అయితే.. నౌహీరా షేక్ మీద బండ్ల గణేష్ కొడుకు హరీష్ ఫిర్యాదు చేశారుడు.. అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించి బెదిరింపులకు పాల్పడ్డారని నౌహీరాపై బండ్ల గణేష్ కుమారుడు హరీష్ ఆరోపించాడు.. మొత్తానికి ఈ ఇష్యూ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది..