హైదరాబాద్ లో పబ్, బార్ కు వెళ్తున్నారా…?

హైదరాబాద్ లో డ్రగ్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో అధికారులు పబ్ లు, బార్ ల మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు.

  • Written By:
  • Publish Date - August 31, 2024 / 12:09 PM IST

హైదరాబాద్ లో డ్రగ్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో అధికారులు పబ్ లు, బార్ ల మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. తాజాగా హైదరాబాద్,రంగారెడ్డి జిల్లాల్లో అర్ధరాత్రి మరోసారి పబ్బులు, బార్ లాల్లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసుల దాడులు జరిగ్గాయి. టిజినాబ్, ఎక్సైజ్ సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. హైదరాబాద్, రంగారెడ్డి లోని 25పబ్బులపై తనిఖీలు నిర్వహించారు.

పబ్బుల్లో అనుమానితులు 107 మందికి డ్రగ్ డిటెక్షన్ కిట్లతో పరీక్షలు చేయగా 6గురికి పాజిటివ్ వచ్చింది. రాత్రి 11గంటల నుండి ఒంటి గంట వరకు తనిఖీలు కొనసాగాయి. ఎక్సోరాలో గంజాయి పరీక్షల్లో ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. రంగరెడ్డి జిల్లాలో బారులలో మరో నలుగురు యువకులకు పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన యువకులు డ్రగ్స్ ఎక్కడ కొనుగోలు చేశారనే దానిపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు విచారణ చేస్తున్నారు.