Yatra 2 : యాత్ర 2 నుంచి అదిరిపోయే అప్ డేట్.. సీఎం జగన్ బర్ డే కి స్పెషల్ పోస్టర్

సినిమా తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం బయోపిక్ మీద సినిమాలు వస్తున్నాయి.. కాదు కాదు తీస్తున్నారు. ఎప్పుడో ఒక సారి రెండు, మూడు సంవత్సరాలకు ఒక సారి వచ్చే బయోపిక్స్ సినిమాలు ఇప్పుడు సంవత్సరంలో ఒకటైన తప్పక వస్తుంది. తప్పక తీస్తున్నారు అని చెప్పవచ్చు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటారా.. అయి అక్కడికే వస్తున్న. మన ఇప్పుడు చెప్పుకునేది ఓ ప్రముఖ వ్యక్తి బయోపిక్ గురించే.. అదే "యాత్ర"

సినిమా తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం బయోపిక్ మీద సినిమాలు వస్తున్నాయి.. కాదు కాదు తీస్తున్నారు. ఎప్పుడో ఒక సారి రెండు, మూడు సంవత్సరాలకు ఒక సారి వచ్చే బయోపిక్స్ సినిమాలు ఇప్పుడు సంవత్సరంలో ఒకటైన తప్పక వస్తుంది. తప్పక తీస్తున్నారు అని చెప్పవచ్చు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటారా.. అయి అక్కడికే వస్తున్న. మన ఇప్పుడు చెప్పుకునేది ఓ ప్రముఖ వ్యక్తి బయోపిక్ గురించే.. అదే “యాత్ర”

2019లో ఏపీ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా వచ్చిన సినిమా యాత్ర. మహీ వి రాఘవ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజ‌యం సాధించింది. దాదాపు 10 సంవత్సరాల తర్వాత అనుకోని కంఘటన కారణంగా ముఖ్యమంత్రి హోదాలో హెలికాప్ట్ర్ ప్రమాదంలో మరణించిన తమ నేతను ఒక్క సారిగి వెండి తెరపైన చూసి ఆనందించారు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు. ఇప్పుడు దానికి సీక్వేల్ గా యాత్ర 2 తెరకెక్కుతుంది. దానికి సంబంధించే నేడు సీఎం జగన్ జన్మదినం సందర్భంగా యాత్ర 2 నుంచి ఓ కిలక అప్ డేట్ విడుదల చేసింది చిత్ర యూనిట్.

గురువారం (డిసెంబర్‌ 21) వైఎస్‌ జగన్‌ పుట్టినరోజుని పురస్కరించుకుని యాత్ర 2 నుంచి ప్రత్యేక పోస్టర్‌ రిలీజ్‌ చేశారు యాత్ర చిత్ర బృదం. ఇక ఈ పోస్ట‌ర్‌లో ఒక‌వైపు జీవా కూర్చొని ఉండ‌గా.. మ‌రోవైపు మమ్ముట్టి ఉన్నాడు. ( అంటే ఒక వైపు సీఎం జగన్ కూర్చొని ఉండగా.. మరో వైపు మాజీ సీఎం దీవంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్న మాట ) ఈ పోస్ట‌ర్‌లో ”నేనెవ‌రో ఈ ప్ర‌పంచానికి ఇంకా తెలియ‌కపోవ‌చ్చు. కానీ ఒక్క‌టి గుర్తుపెట్టుకోండి. నేను వైఎస్. రాజశేఖర్‌రెడ్డి కొడుకుని” అంటూ పోస్ట‌ర్‌లో రాసుకోచ్చారు. ఇక ఈ సినిమాలో వైఎస్సార్‌ పాత్రలో మలయాళ స్టార్‌ మమ్ముట్టి నటిస్తుండగా వైఎస్‌ జగన్‌ పాత్రలో జీవా నటిస్తున్నారు.

కాగా యాత్ర 2 చిత్రం త్రీ ఆటమ్‌ లీవ్స్, వీ సెల్యూలాయిడ్, శివ మేక సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎక్కడ డిలే చేయకుండా ‘యాత్ర 2’ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను 2024 ఫిబ్రవరి 08న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు చిత్ర‌యూనిట్ తెలిపారు. అంటే ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ముందే యాత్ర 2 సినిమా వచ్చేలా ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది.

ఇక యాత్ర సినిమాలో జగన్మోహన్ రెడ్డి పాత్ర‌లో కోలీవుడ్ యాక్ట‌ర్ జీవా న‌టిస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్‌, ఫ‌స్ట్ లుక్ విడుదల చేయగా ప్రేక్షకులను తేగ ఆకట్టుకుంది.