Bigg Boss Winner, Prashanth Arrested : బిగ్ బాస్ విజేతకు 14 రోజుల రిమాండ్.. చంచల్ గూడ జైలులో పల్లవి ప్రశాంత్

బిగ్ బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ డిసెంబర్ రాత్రి జరిగిన ఉద్రిక్తల నేపథ్యంలో నిన్న రాత్రి పల్లవి ప్రశాంత్ తన స్వగ్రమంలో పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా పల్లవి ప్రశాంత్ కు 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం పల్లవి ప్రశాంత్ ను ఆయన సోదరుడిని చంచల్ గూడ జైలుకు తరలించారు.

బిగ్ బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ డిసెంబర్ రాత్రి జరిగిన ఉద్రిక్తల నేపథ్యంలో నిన్న రాత్రి పల్లవి ప్రశాంత్ తన స్వగ్రమంలో పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా పల్లవి ప్రశాంత్ కు 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం పల్లవి ప్రశాంత్ ను ఆయన సోదరుడిని చంచల్ గూడ జైలుకు తరలించారు.

కాగా డిసెంబర్ రాత్రి బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రోజు నా.. పల్లవి ప్రశాంత్ ను విజేతగా ప్రకటించిన తర్వత ప్రశాంత్, అమర్ దీప్ ఫ్యాన్స్ కి మధ్య గొడవ జరిగి.. తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ ఘటనలో రోడ్డుపై వెళ్తున్న 6 ఆర్టీసీ బస్సుల అద్దాలు ధ్వంసం చేశారు అల్లరి మూకలు. బిగ్ బాస్ వద్దకు బందోబస్తుకు వచ్చిన పంజాగుట్ట ఏసీపీ కారు అద్దం తోపాటు విధులు నిర్వహించడానికి వచ్చిన బెటాలియన్ బస్సు అద్దాన్ని పగులగొట్టారు. దీంతో పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన నేపథ్యంలో పల్లవి ప్రశాంత్ తదితరులపై తొమ్మిది సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1గా ప్రశాంత్‌, ఏ2గా మనోహర్‌, ఏ3గా అతడి స్నేహిడుతు వినయ్‌ను, ఏ4గా ఉప్పల్‌కు చెందిన సాయికిరణ్‌, అంకిరావుపల్లి రాజును అరెస్ట్‌ చేయగా నిన్న రాత్రి ప్రశాంత్‌, మనోహర్‌తో పాటు 14 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం రాత్రి ప్రశాంత్ ను అరెస్ట్ చేశారు. ఇక ప్రశాంత్ ను మెజిస్టేట్ ముందు హాజరుపర్చగా.. 14రోజులు రిమాండ్ విధించడం జరిగిందని తెలిపారు. ఈ కేసుపై విచారణ జరుగుతుందని తెలిపారు.