MADHAVI LATHA: హైదరాబాద్‌ శివంగి.. మాధవీలత ఆస్తులు ఎన్ని అంటే..

మాధవీలతను గెలిపించేందుకు ఢిల్లీ నుంచి పెద్దలు దిగివస్తున్నారు. పాతబస్తీ గడ్డపై బీజేపీ జెండా ఎగరేసి.. ఒవైసీకి ఓటమి రుచి చూపిస్తానని మాధవీలత ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ లోక్‌సభ సెగ్మెంట్‌ చుట్టేస్తున్న ఆమె.. నామినేషన్ దాఖలు చేశారు.

  • Written By:
  • Publish Date - April 25, 2024 / 07:11 PM IST

MADHAVI LATHA: మాధవీలత.. సోషల్‌ మీడియాలో మారుమోగిపోతున్న పేరు. హైదరాబాద్‌లో ఒవైసీతో ఢీ అంటే ఢీ అంటున్న మాధవీలత.. వినూత్నప్రచారంతో దూసుకుపోతున్నారు. ఒవైసీని ఓడించి తీరుతానని సవాల్‌ విసురుతున్న ఆమె.. పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. మాధవీలతను గెలిపించేందుకు ఢిల్లీ నుంచి పెద్దలు దిగివస్తున్నారు. పాతబస్తీ గడ్డపై బీజేపీ జెండా ఎగరేసి.. ఒవైసీకి ఓటమి రుచి చూపిస్తానని మాధవీలత ధీమా వ్యక్తం చేస్తున్నారు.

YS JAGAN: అవినాష్ తప్పు చేయలేదన్న జగన్.. చెల్లెళ్ల ఫైర్

ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ లోక్‌సభ సెగ్మెంట్‌ చుట్టేస్తున్న ఆమె.. నామినేషన్ దాఖలు చేశారు. తన ఎన్నికల అఫిడవిట్ లో ఆస్తుల వివరాలను ప్రకటించారు. స్థిర చరాస్తులన్నీకలిపి 218కోట్లు అని తెలిపారు. చరాస్తుల విలువ 165.46కోట్లు …స్థిరాస్తుల విలువ 55.92 కోట్లు ఉన్నట్లుగా అఫిడవిట్‌లో పొందుపరిచారు. 27 కోట్ల 3లక్షల అప్పులు ఉన్నట్లు ప్రకటించారు. విరించి ఆసుపత్రి మాతృసంస్థ అయిన విరించి లిమిటెడ్‌లో తన పేరిట 8 కోట్ల 92 లక్షల విలువైన షేర్లు, భర్త కొంపెల్ల విశ్వనాథ్ పేరిట 56 కోట్ల 19లక్షల విలువైన షేర్లు ఉన్నాయని వివరించారు.

అన్‌లిస్టెడ్ కంపెనీలైన పీకేఐ సొల్యూషన్స్, విరా సిస్టమ్స్, గజ్వేల్ డెవలపర్స్‌లో తన పేరుతో 16 కోట్ల 27 లక్షల షేర్లు ఉన్నట్లు తెలిపారు. ఐతే తన పేరుతో వ్యవసాయ భూములు, వాహనాలు ఏమి లేవని చెప్పారు. తన పేరిట ఓ క్రిమినల్ కేసు ఉన్నట్లు తన ఎన్నికల అఫిడవిట్ లో మాధవీలత పొందుపరిచారు.