పంత్ టార్గెట్ గా బాలీవుడ్ బ్యూటీ

టీమిండియా స్టార్ వికెట్ కీపర్‌ రిషభ్ పంత్‌పై గతంలో సంచలన ఆరోపణలు చేసిన బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా మరోసారి అతనికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుందా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

  • Written By:
  • Publish Date - August 11, 2024 / 04:39 PM IST

టీమిండియా స్టార్ వికెట్ కీపర్‌ రిషభ్ పంత్‌పై గతంలో సంచలన ఆరోపణలు చేసిన బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా మరోసారి అతనికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుందా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఆమె షేర్ చేసిన వీడియో పలు సందేహాలను అడ్రస్ గా మారింది. రిషభ్ పంత్ బ్యాటింగ్‌కు సంబంధించిన ఓ వీడియో క్లిప్‌ను ఏఐ టెక్నాలజీ సాయంతో ఊర్వశీ రౌటేలా స్పూఫ్ చేసింది. టీ20 ప్రపంచకప్ లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రిషభ్ పంత్ కొట్టిన విన్నింగ్ సిక్స్‌కు సంబంధించిన వీడియోను ఈ బాలీవుడ్ బ్యూటీ ఏఐ సాయంతో స్పూఫ్ చేసింది.

పంత్ విన్నింగ్స్ సిక్స్ వీడియోను..తాను బ్యాటింగ్ చేసినట్లుగా ఊర్వశి స్పూఫ్ చేసింది. రిషభ్ పంత్ స్థానంలో తాను బ్యాటింగ్ చేసినట్లు ఏఐ సాయంతో మార్చింది. ఆరెంజ్ జెర్సీలో ఊర్వశీ బ్యాటింగ్ చేయడం హైలెట్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారగా.. ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్ చేస్తున్నారు. పంత్‌కు దగ్గరయ్యేందుకు ఊర్వశీ ప్రయత్నిస్తుందని ఒకరంటే.. మళ్లీ అందరి దృష్టిని ఆకర్షించేందుకు అతన్ని టార్గెట్ చేస్తుందని మరికొందరు అంటున్నారు. గతంలో రిషభ్ పంత్‌పై ఊర్వశి రౌటే బోల్డ్ కామెంట్ చేసింది. ఆమె కామెంట్స్ పంత్ ఖండించగా.. ఆమె ఘాటుగా బదులిచ్చింది. సోషల్ మీడియా వేదికగా ఈ ఇద్దరి మధ్య పెద్ద యుద్దమే నడిచింది.