Telangana Cabinet : నేడు కేబినెట్ భేటీ.. ఆగస్టు 15 కల్లా రుణమాఫీ అమలుపై చర్చ

నేడు సీఎం రేవంత్ అధ్యక్షతన సచివాలయంలో ఇవాళ సాయంత్ర 4 గంటలకు మంత్రివర్గం సమావేశం కానుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రైతు రుణమాఫీ పథకంను అములు దిశగా ఈ భేటి ఉండనున్నట్లు తెలుస్తుంది.

నేడు సీఎం రేవంత్ అధ్యక్షతన సచివాలయంలో ఇవాళ సాయంత్ర 4 గంటలకు మంత్రివర్గం సమావేశం కానుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రైతు రుణమాఫీ పథకంను అములు దిశగా ఈ భేటి ఉండనున్నట్లు తెలుస్తుంది. తెలంగాణ ప్రబుత్వం సీఎం రేవంత్ రెడ్డి.. ఆగస్టు 15కల్లా రుణమాఫీ అమలు చేసి తీరుతామని సీఎం ప్రకటన చేశారు. ఈ ఆగస్టులోపు రైతు రుణమాఫీ అమలు చేసే విధివిధానాలు, అర్హతలపై చర్చించే అవకాశముంది. రైతు భరోసా విషయంలోనూ నిర్ణయం తీసుకునే ఛాన్సుంది. ఇక రానున్న తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో వ్యవసాయానికి కేటాయించే బడ్జెట్ పై మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి సలహాలు..సూచనలు తీసుకోని రైతులకు న్యాయం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకోచ్చారు.

కాగా మరోవైపు మంత్రి వర్గ విస్తరణపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఈ మంత్రి వర్గ విస్తరణలో పోచారం శ్రీనివాస్ రెడ్డికి గౌరవమైన హోదా కల్పిస్తాం చెప్పుకోచ్చారు.