దేవినేని అవినాష్ దుబాయ్ ప్లాన్, ఎయిర్పోర్ట్ లో షాక్…!

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నేతలకు టీడీపీ చుక్కలు చూపిస్తోంది. ఒక్కొక్కరి మీద ఉన్న అక్రమాలు, అవినీతి, దౌర్జన్యం కేసులను బయటకు తీస్తోంది. దీనితో కొందరు వైసీపీ నేతలు దేశం వదిలి పారిపోయే ప్లాన్ లో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి.

  • Written By:
  • Publish Date - August 16, 2024 / 11:49 AM IST

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నేతలకు టీడీపీ చుక్కలు చూపిస్తోంది. ఒక్కొక్కరి మీద ఉన్న అక్రమాలు, అవినీతి, దౌర్జన్యం కేసులను బయటకు తీస్తోంది. దీనితో కొందరు వైసీపీ నేతలు దేశం వదిలి పారిపోయే ప్లాన్ లో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. తాజాగా వైసీపీ నేత దేవినేని అవినాష్ ఇలాగే దుబాయ్ వెళ్ళిపోయే ప్లాన్ చేసారు. వైకాపా నేత దేవినేని అవినాష్ కు హైదరాబాద్ విమానాశ్రయంలో షాక్ తగిలింది.

గురువారం రాత్రి ఆయన హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నం చేసారు. శంషాబాద్ విమానాశ్రయం అధికారులు మంగళగిరి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో… అవినాష్ పై కేసులు ఉండటంతో ప్రయాణానికి అనుమతులు ఇవ్వొద్దు అని విమానాశ్రయ అధికారులను కోరారు. దీనితో దేవినేని అవినాష్ ప్రయాణాన్ని పోలీసులు అడ్డుకోవడంతో ఆయన శంషాబాద్ విమానాశ్రయం నుంచి వెనక్కి వెళ్లిపోయారు. తెదేపా కార్యాలయంపై దాడి కేసులో గతంలో అవినాష్ పై ఎఫ్ఎఆర్ నమోదైన సంగతి తెలిసిందే. దాడిలో పాల్గొన్న వారిపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసారు. అయినా సరే అవినాష్ దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నం చేయడం హాట్ టాపిక్ అయింది.