హరీష్ శంకర్ ప్లాన్ మాములుగా లేదుగా…

  • Written By:
  • Publish Date - August 6, 2024 / 05:25 PM IST

మల్టీ స్టారర్ సినిమాలకు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ వేరే లెవెల్. మల్టీ స్టారర్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఒక రేంజ్ లో ఎదురు చూస్తూ ఉంటారు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత మల్టీ స్టారర్ సినిమాల స్పీడ్ పెరిగే అవకాశం ఉందని, మెగా నందమూరి కుటుంబాలు కలిసి మళ్ళీ నటించే అవకాశం ఉందని సినీ వర్గాల్లో పెద్ద చర్చ జరిగింది. దీనికి సంబంధించి ముందు అడుగు పడలేదు. ఇటీవల ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ చేసిన వ్యాఖ్యలతో మన తెలుగులో మళ్ళీ మల్టీ స్టారర్ సినిమాల సందడి మొదలయ్యే అవకాశాలు కనపడుతున్నాయి.

చిరంజీవి, పవన్ కళ్యాణ్ కోసం ఒక లైన్ అనుకున్నాడట ఈ యువ దర్శకుడు. దీనికి సంబంధించి ఇంకా చర్చలు జరుగుతున్నాయని, తాను అనుకున్నది అనుకున్నట్టు జరిగితే మాత్రం కచ్చితంగా పాన్ ఇండియా ను మించిన సినిమా అవుతుంది అన్నాడు హరీష్. ఇక ఇప్పుడు మరో సెన్సేషనల్ కామెంట్ చేసాడు హరీష్ శంకర్. ఆహా ఓటీటీ వేదికగా ప్రసారం అయ్యే… మ్యూజికల్‌ షో తెలుగు ఇండియన్ ఐడల్‌ సీజన్ – 3లో హరీష్ పాల్గొన్నాడు. మిస్టర్ బచ్చన్ సినిమా ప్రమోషన్ లో భాగంగా హరీష్ ఈ షో కి వచ్చాడు.

ఈ సందర్భంగా మల్టీ స్టారర్ సినిమా చేసే అవకాశం వస్తే ఎవరితో చేస్తారని అడగగా… రవితేజ, పవన్ కళ్యాణ్ తో కలిపి చేస్తానని అన్నాడు. ఈ సినిమా గనుక వర్కౌట్ అయితే మాత్రం కచ్చితంగా మాస్ ఆడియన్స్ కు పండగ అనే చెప్పాలి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్… ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాను ప్లాన్ చేసాడు. పవన్ కళ్యాణ్ బిజీగా ఉండటంతో ఆ సినిమా ఆలస్యం అవుతూ వస్తోంది. దీనిపై త్వరలోనే ఒక కీలక అడుగు పడే అవకాశం కనపడుతోంది. ఇక మిస్టర్ బచ్చన్ సినిమా ఫ్యాన్స్ కి కచ్చితంగా నచ్చుతుందని ధీమా వ్యక్తం చేసాడు.