బెంగళూరులో హర్షా సాయి…?

యూట్యూబ్ స్టార్ హర్ష సాయి కేసులో పోలీసుల విచారణ వేగవంతం అయింది. హర్ష సాయిపై తాను చేసిన ఆరోపణలపై బాధితురాలు పోలీసులకు ఆధారాలు సమర్పించింది. ఇప్పటికే బాధితురాలికి వైద్య పరీక్షలు పూర్తి చేసారు.

  • Written By:
  • Publish Date - September 27, 2024 / 08:52 AM IST

యూట్యూబ్ స్టార్ హర్ష సాయి కేసులో పోలీసుల విచారణ వేగవంతం అయింది. హర్ష సాయిపై తాను చేసిన ఆరోపణలపై బాధితురాలు పోలీసులకు ఆధారాలు సమర్పించింది. ఇప్పటికే బాధితురాలికి వైద్య పరీక్షలు పూర్తి చేసారు. నార్సింగి పోలీసుల చేతికి బాధితురాలి మెడికల్ రిపోర్ట్స్ అందాయి. ఈ విషయం బయటకు వచ్చిన దగ్గరి నుంచి హర్షా సాయి పరారీలోనే ఉన్నాడు. బెంగళూరు, గోవాకు పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

హర్ష సాయి వ్యక్తిగత మొబైల్ స్విచ్ ఆఫ్ ఉన్నట్లు చెబుతున్న పోలీసులు… అతని కోసం ఇప్పటికే ఆ రెండు ప్రాంతాలకు వెళ్లినట్టు సమాచారం. కూల్ డ్రింక్ లో మత్తుమందు ఇచ్చి లైంగిక దాడి చేయడంతో పాటు… వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ పాల్పడుతున్నాడంటూ బాధితురాలు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఇచ్చిన సీసీ ఫుటేజ్ , ఫోటోలు , వాట్సప్ చాటింగ్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు.