ఉద్యోగులకు ఐటి కంపెనీ చుక్కలు

ఈ మధ్య కాలంలో ఐటి కంపెనీలు ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నాయనే వార్తలు వింటూనే ఉన్నాం. తాజాగా మాదాపూర్ లో ఒక ఐటి కంపెనీ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది.

  • Written By:
  • Publish Date - September 3, 2024 / 01:00 PM IST

ఈ మధ్య కాలంలో ఐటి కంపెనీలు ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నాయనే వార్తలు వింటూనే ఉన్నాం. తాజాగా మాదాపూర్ లో ఒక ఐటి కంపెనీ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. మైండ్ స్పేస్ లోనీ బ్రెయిన్ ఎంటర్ప్రైజెస్ పేరుతో కంపెనీ నిర్వహిస్తున్నారు. కొన్ని నెలల నుండి జితాలు ఇవ్వకుండా వేధిస్తున్నారని పోలీసులకు ఉద్యోగులు ఫిర్యాదులు చేసారు. సింగపూర్ , బెంగుళూరు , ముంబై పలు ప్రాంతాలలో బ్రాంచ్ లు కూడా ఉన్నాయి ఈ సంస్థకు.

దాదాపు 2500 ఉద్యోగుల ఈ కంపెనీలో పనిచేస్తున్నట్టుగా సమాచారం. ముదస్తు సమాచారం ఇవ్వకుండానే 1500 మంది ఉద్యోగులను తొలగించారు. దీనితో ఉద్యోగులు రంగారెడ్డి జిల్లా లేబర్ జాయింట్ కమిషర్ కు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. కంపెనీ యజమాని అమెరికాలో ఉంటున్నట్టు ఉద్యోగులు భావిస్తున్నారు.