ఎన్నోసార్లు గుండు కొట్టించుకున్నా: కొడాలి ఈజ్ బ్యాక్

గత కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న మాజీ మంత్రి కొడాలి నానీ మళ్ళీ ఫాం లోకి వచ్చారు. నేడు తాడేపల్లిలో కృష్ణా జిల్లా నేతలను కలిసిన అనంతరం మీడియా సమావేశం నిర్వహించి కీలక వ్యాఖ్యలు చేసారు.

  • Written By:
  • Updated On - September 25, 2024 / 04:10 PM IST

గత కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న మాజీ మంత్రి కొడాలి నానీ మళ్ళీ ఫాం లోకి వచ్చారు. నేడు తాడేపల్లిలో కృష్ణా జిల్లా నేతలను కలిసిన అనంతరం మీడియా సమావేశం నిర్వహించి కీలక వ్యాఖ్యలు చేసారు. సీఎం జగన్ రాజీనామా చేశాక జరిగిన నెయ్యి సరఫరా లో కల్తీ ఉంటే రిజెక్ట్ చేసిన టాంకర్ రిపోర్ట్ ను పట్టు కొని రాజకీయ లబ్ది కోసం జంతువుల కొవ్వు కలిసింది వాటితో లడ్డూ తయారు చేశారు అని అనటం రాజకీయ ప్రయోజనాలు కోసం చేస్తున్నారు అని మండిపడ్డారు.

కలియుగ దైవం అయిన వెంకటేశ్వర స్వామి రాజకీయాలకు లాగిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అని మండిపడ్డారు. ప్రసాదం తయారీ లో కల్తీ నెయ్యి వాడలేదు ఎన్నో సార్లు టాంకర్ లు రిజెక్ట్ అయ్యాయి అని ఎక్కడ ప్రసాదం లో కల్తీ నెయ్యి వాడలేదు అని స్పష్టం చేసారు. దేవున్ని రాజకీయానికి వాడే వ్యక్తి చంద్రబాబు నాయుడు అని విమర్శించారు. తాను ఎన్నో సార్లు గుండు కొట్టిన్చుకున్నా అని చంద్రబాబు ఎన్ని సార్లు కొట్టించుకున్నారో చెప్పాలని డిమాండ్ చేసారు.