కెప్టెన్సీ ఇస్తాం.. వచ్చేయ్ సూర్య భాయ్ కి కోల్ కత్తా ఆఫర్

ఐపీఎల్ 2025 సీజన్ కు ముందు జరగనున్న మెగా వేలంపై ఫ్రాంచైజీలు ఫోకస్ పెట్టాయి. పలు జట్లు తమ కెప్టెన్లని మార్చడం ఖాయంగా కనిపిస్తోంది.

  • Written By:
  • Publish Date - August 25, 2024 / 01:36 PM IST

ఐపీఎల్ 2025 సీజన్ కు ముందు జరగనున్న మెగా వేలంపై ఫ్రాంచైజీలు ఫోకస్ పెట్టాయి. పలు జట్లు తమ కెప్టెన్లని మార్చడం ఖాయంగా కనిపిస్తోంది.దీనిలో భాగంగా ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ సూర్య కుమార్ యాదవ్ కి కోల్ కత్తా నైట్ రైడర్స్ భారీ ఆఫర్ ఇచ్చింది. తమ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు ఇస్తామని సూర్య కుమార్ కు ప్రతిపాదన పంపింది. దీనిపై కోల్ కత్తా ప్రతినిధులు అతన్ని సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి.

సూర్య కుమార్ ఒప్పుకుంటే దీనికి బదులుగా శ్రేయాస్ అయ్యర్ ను ట్రేడింగ్ ద్వారా ముంబై కు ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీని కోసం భారీ మొత్తం చెల్లించేందుకు కూడా కోల్ కత్తా రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.అయితే సూర్య కుమార్ యాదవ్ దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని సమాచారం. మరోవైపు హర్థిక్ ను తప్పించి సూర్యా కే జట్టు పగ్గాలు ఇవ్వాలని ముంబై భావిస్తున్నట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో కోల్ కత్తా ఆఫర్ ను ఆ ఫ్రాంచైజీ ఒప్పుకుంటుందా లేదా అనేది చూడాలి.