జగన్ కు బిగ్ షాక్, దూరం కానున్న కీలక నేత…!

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారం కోల్పోయి ఒక పక్కన ఇబ్బంది పడుతున్న సమయంలో ఆ పార్టీ నేతలు వరుస షాక్ లు ఇస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

  • Written By:
  • Publish Date - August 28, 2024 / 01:00 PM IST

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారం కోల్పోయి ఒక పక్కన ఇబ్బంది పడుతున్న సమయంలో ఆ పార్టీ నేతలు వరుస షాక్ లు ఇస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కీలక నేత వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరేందుకు సిద్దమవుతున్నారు. జగన్ కి అత్యంత సన్నిహితుడు మాజీ మంత్రి రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ వైసీపీకి త్వరలో గుడ్ బాయ్ చెప్పనున్నారు.

రేపు ఎల్లుండిలో వైసీపీ పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్న మోపిదేవి వెంకటరమణ… వచ్చే నెల 6 గాని 8 గాని టిడిపిలో చేరే అవకాశం ఉంది. జగన్ అక్రమాస్తుల కేసులో.. వాన్ పిక్ భూముల కేసుల్లో జగన్ తో పాటు జైలుకి వెళ్ళారు మోపిదేవి. గత ఐదు సంవత్సరాలు కాలంలో మోపిదేవికి మంత్రి పదవితో పాటుగా, ఆ తర్వాత రాజ్యసభ సీట్ ఇచ్చారు జగన్. మొన్నటి ఎన్నికల్లో ఆయన రేపల్లె నుంచి సీటు అడిగినా జగన్ నిరాకరించారు దీనితో మోపిదేవి పార్టీ మారతారు అనే ప్రచారం జరిగింది. సజ్జల రామకృష్ణారెడ్డి తో పలుమార్లు మోపిదేవికి గొడవలు అయినట్టు వార్తలు వచ్చాయి.