చంద్రబాబుని ఇబ్బంది పెట్టిన ఎస్ఐకి పోస్టింగ్, ఎమ్మెల్యే సీరియస్

ఆంధ్రప్రదేశ్ లో కొందరు అధికారులకు పోస్టింగ్ ఇచ్చిన వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. తాజాగా రామచంద్రపురం ఎస్ఐ వాసు పోస్టింగ్ వ్యవహారం వివాదాస్పదం అయింది.

  • Written By:
  • Publish Date - September 8, 2024 / 06:34 PM IST

ఆంధ్రప్రదేశ్ లో కొందరు అధికారులకు పోస్టింగ్ ఇచ్చిన వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. తాజాగా రామచంద్రపురం ఎస్ఐ వాసు పోస్టింగ్ వ్యవహారం వివాదాస్పదం అయింది. గతంలో చంద్రబాబు నాయుడుని అనపర్తికి వెళ్లకుండా అడ్డుకున్న వాసుకి ఏ విధంగా పోస్టింగ్ ఇస్తారని ఎమ్మెల్యే నల్లమిల్లి సూర్యనారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. చంద్రబాబు కాన్వాయ్ ముందుకు వెళ్లకుండా రోడ్డుకు అడ్డంగా పోలీసులను కూర్చోబెట్టారు బిక్కవోలు ఎస్ఐ వాసు.

అలాంటి వ్యక్తికి పోస్టింగ్ ఇవ్వడంపై అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. ఫోన్ లో మంత్రి వాసంశెట్టి సుభాష్ తో మాట్లాడి ఆగ్రహం వ్యక్తం చేసారు. వైసీపీ నేతల ఆదేశాలతో చంద్రబాబును, అప్పట్లో తనను ఇబ్బంది పెట్టిన వాసుకు మంత్రి తన నియోజకవర్గంలో పోస్టింగ్ వేయించడంపై ఆగ్రహం వ్యక్తం చేసారు. వైసీపీ ఎస్ఐకి మంత్రి అండగా నిలబడటంపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేసారు. ఎస్ఐ పోస్టింగ్ వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లడానికి ఎమ్మెల్యే నల్లమిల్లి సిద్దమవుతున్నారు.