ఏపీ మంత్రుల ప్రోగ్రెస్… పవన్ చేతికి రిపోర్ట్ ఇస్తానన్న చంద్రబాబు…

ఆంధ్రప్రదేశ్ కేబినేట్ సమావేశం వాడీ వేడీగా సాగింది. కెబినెట్ భేటీలో మంత్రుల పని తీరుపై సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. వంద రోజుల తర్వాత ప్రొగ్రెస్ రిపోర్ట్ ఇస్తానని చంద్రబాబు పేర్కొన్నారు. జనసేన మంత్రుల రిపోర్ట్ పవన్ కళ్యాణ్ కు అందచేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.

  • Written By:
  • Publish Date - August 28, 2024 / 05:12 PM IST

ఆంధ్రప్రదేశ్ కేబినేట్ సమావేశం వాడీ వేడీగా సాగింది. కెబినెట్ భేటీలో మంత్రుల పని తీరుపై సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. వంద రోజుల తర్వాత ప్రొగ్రెస్ రిపోర్ట్ ఇస్తానని చంద్రబాబు పేర్కొన్నారు. జనసేన మంత్రుల రిపోర్ట్ పవన్ కళ్యాణ్ కు అందచేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. కొందరు మంత్రులు.. ఎమ్మెల్యేలు వివాదస్పదంగా వ్యవహరించడంపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. కొందరు చేసే తప్పిదాల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని మండిపడ్డారు. ఒకరిద్దరు చేసే తప్పుల వల్ల ప్రభుత్వం చేసే మంచి పక్కకు పోయి.. చెడ్డ పేరే హైలెట్ అవుతోందంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు.

కుటుంబ సభ్యుల ప్రవర్తన మీతిమీరకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంత్రులు.. ఎమ్మెల్యేలేదని చంద్రబాబు స్పష్టం చేసారు. రివర్స్ టెండరింగ్ విధానంపై కీలక చర్చ జరిగింది. గత ప్రభుత్వం మాయ చేయడానికే రివర్స్ టెండరింగ్ విధానం ప్రవేశపెట్టిందని కేబినేట్ లో మంత్రులు అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వంలో సుమారు 40 ప్రాజెక్టులకు సింగిల్ టెండర్ పడిందని.. ఇంకేం రివర్స్ టెండరింగ్ విధానం అంటూ పలువురు మంత్రులు వ్యాఖ్యానించారు. సీవీసీ గైడ్ లైన్స్ ప్రకారం టెండర్ల ప్రక్రియ జరిపించాలని సూచనలు చేసారు.

గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన జుడిషియరీ ప్రివ్యూను కూడా రద్దు చేయాలని కేబినేట్ భావించింది. తాను చేసిన తప్పులకు ఓ జడ్జీతో ఆమోద ముద్ర వేసేలా జుడిషియరీ ప్రివ్యూ వ్యవస్థను జగన్ ఏర్పాటు చేశారని పలువురు మంత్రులు వ్యాఖ్యానించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో జుడిషియరీ ప్రివ్యూను రద్దు చేసేలా చూడాలని పలువురు మంత్రులు పేర్కొన్నారు. ఉచిత ఇసుక పాలసీ అమలుపై కెబినెట్లో చర్చ జరిగింది. ఇప్పుడిప్పుడే ఇసుక పాలసీ స్ట్రీమ్ లైన్లో పడుతోందని చంద్రబాబు అనగా టైమింగ్స్ లేకుండా డే అండ్ నైట్ ఇసుక సరఫరాకి అవకాశం కల్పిస్తే స్టాక్ పాయింట్ల వద్ద లారీల రద్దీ తగ్గుతుందని మంత్రి నిమ్మల అభిప్రాయపడ్డారు.

పట్టా భూముల్లోనూ ఇసుక తవ్వకాలకు అనుమతివ్వాలని సూత్రప్రాయంగా కెబినెట్ అంగీకారం తెలిపింది. సార్టెక్స్ బియ్యం సరఫరాను నిలిపిస్తే.. విమర్శలు వస్తాయేమోనన్న పలువురు మంత్రులు అభిప్రాయాన్ని చంద్రబాబు తీసుకున్నారు. మరింత అధ్యయనం చేసి సార్టెక్స్ బియ్యం పంపిణీపై నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు. రేషన్ బియ్యం డెలివరీ వాహానాలని రద్దు చేయాలనే నిర్ణయంపై కెబినెట్లో చర్చ జరగగా వాహానాలకు బ్యాంక్ లింకేజీ ఉన్నట్టు చెప్పారు. రేషన్ బియ్యం డెలివరీ వాహానాల వల్ల ఎలాంటి ఉపయోగం లేదని ఆర్ధిక మంత్రి పయ్యావుల అభిప్రాయపడ్డారు. బ్యాంక్ లింకేజీ ఉన్నందున్న ఎదురయ్యే సాంకేతిక ఇబ్బందులు.. వాటిని ఏ విధంగా వినియోగించుకోవాలనే అంశంపై మరింత చర్చించి నిర్ణయం తీసుకుందామని చంద్రబాబు సూచించారు.