షాక్: రవితేజకు దెబ్బ మీద దెబ్బ

న 75 వ సినిమా షూటింగ్ లో రవితేజా గాయపడ్డారు. ఆ గాయం తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉందట. ఆర్టీ75వ షూటింగ్ లో రవితేజ కుడిచేతికి గాయం అయిందని ఆయన టీం వెల్లడించింది. కాని ఆ గాయాన్ని లెక్క చేయకుండా ఆయన షూట్ లో పాల్గొన్నారు.

  • Written By:
  • Publish Date - August 23, 2024 / 06:35 PM IST

మిస్టర్ బచ్చన్ సినిమాతో ఫ్యాన్స్ ను నిరాశపరిచిన మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు ఫ్యాన్స్ కు మరో బ్యాడ్ న్యూస్ చెప్పాడు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ ఎదుర్కొంటున్న ఆయనకు ఇప్పుడు దాదాపు రెండు నెలల పాటు షూట్ కి దూరమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. తన 75 వ సినిమా షూటింగ్ లో రవితేజా గాయపడ్డారు. ఆ గాయం తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉందట. ఆర్టీ75వ షూటింగ్ లో రవితేజ కుడిచేతికి గాయం అయిందని ఆయన టీం వెల్లడించింది. కాని ఆ గాయాన్ని లెక్క చేయకుండా ఆయన షూట్ లో పాల్గొన్నారు.

కుడిచేతి గాయం ఎక్కువ కావడంతో యశోద ఆస్పత్రిలో రవితేజకు శస్త్రచికిత్స చేసారు. ఆరు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని రవితేజకు వైద్యులు సూచించడంతో దాదాపు ఆయన రెండు నెలల పాటు షూట్ కి దూరం కానున్నారు అని తెలుస్తోంది. ఈ గాయం తగ్గే వరకు రవితేజా పశ్చిమ బెంగాల్ లోని సిలిగురి వెళ్తారని, ఆయన అక్కడే ఉండే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. కొన్ని రోజులు సినిమా హడావుడి లేకుండా ఫ్యామిలీతో గడపాలని ఆయన భావిస్తున్నారు. త్వరలోనే ఆయన మూడు సినిమాలను లైన్ లో పెడుతున్నారు.

వచ్చే ఏడాది రెండు సినిమాలు ఈ ఏడాది ఇంకో సినిమా విడుదల చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. వాటికి ఇబ్బంది రాకుండా ప్లాన్ చేస్తున్నారట. అసలే మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ తో ఫ్యాన్స్ ఇప్పుడు నిరాశలో ఉన్నారు. ఈ సినిమాకు వసూళ్లు కూడా పెద్దగా రాలేదు. ఇప్పటి వరకు 14 కోట్లు మాత్రమే ఈ సినిమా వసూలు చేసింది. దీనితో దర్శకుడు హరీష్ శంకర్ తన రెమ్యునరేషన్ ను వెనక్కు ఇచ్చేస్తున్నారని టాక్ వస్తోంది. ఇక రవితేజా కూడా 50 శాతం వెనక్కు ఇవ్వాలని భావిస్తున్నారట. మిస్టర్ బచ్చన్ లో హీరోయిన్ ను అందంగా చూపించడం మినహా పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదని ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేసారు.