REVANTH REDDY: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతుంది.. తెలంగాణకు దొరల పాలన నుంచి విముక్తి: రేవంత్ రెడ్డి

తెలంగాణకు దొరల పాలన నుంచి విముక్తి కలగబోతుంది. డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతుంది. కాంగ్రెస్ కార్యకర్తల పోరాటం ఫలించబోతుంది. దేశంలోని అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తాయని చెబుతున్నాయి. సోనియమ్మకు కృతజ్ఞతలు తెలిపే సమయం వచ్చింది.

  • Written By:
  • Publish Date - November 30, 2023 / 07:21 PM IST

REVANTH REDDY: డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతుందని, తెలంగాణకు దొరల పాలన నుంచి విముక్తి కలగబోతుందని వ్యాఖ్యానించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన అనంతరం రేవంత్ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. “పదేళ్లుగా తెలంగాణను పట్టి పీడిస్తున్న కేసీఆర్‌ను కామారెడ్డిలో ఓడిస్తున్నందుకు సంతోషంగా ఉంది. తెలంగాణ సమాజం చైతన్యవంతమైనదని మరోసారి నిరూపించారు. మలి తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారికి ఘన నివాళి అర్పిస్తున్నా. శ్రీకాంతాచారి ప్రాణత్యాగంతో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. ఆనాడు డిసెంబర్ 3న శ్రీకాంతాచారి తుది శ్వాస వదిలాడు. యాదృచ్ఛికంగా డిసెంబర్ 3న తెలంగాణ ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి.

KCR: కామారెడ్డిలో కేసీఆర్‌కు ఓటమి తప్పదా.. ఎగ్జిట్ పోల్ ఫలితం ఇదే..!

డిసెంబర్ 9, 2009న తెలంగాణకు మొదటి పునాదిరాయి పడింది. ఇప్పుడు అవే తేదీల్లో తెలంగాణకు దొరల పాలన నుంచి విముక్తి కలగబోతుంది. డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతుంది. కాంగ్రెస్ కార్యకర్తల పోరాటం ఫలించబోతుంది. దేశంలోని అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తాయని చెబుతున్నాయి. సోనియమ్మకు కృతజ్ఞతలు తెలిపే సమయం వచ్చింది. తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చేందుకు ఒక్క అవకాశం ఇవ్వాలని సోనియమ్మ కోరింది. ఎన్నికల ఫలితాలు బీఆరెస్‌కు అనుకూలంగా లేవనే కేసీఆర్ ప్రెస్‌మీట్ పెట్టలేదు. ఇవాళ ఆ చంద్రుడికి మబ్బులు పట్టినయ్. ఆయన కనిపించకుండా పోయారు. కేటీఆర్ చెప్పింది తప్పయితే.. ప్రజల ముందుకు వచ్చి క్షమాపణలు చెబుతారా..? కాంగ్రెస్ శ్రేణులు డిసెంబర్ 3 వరకు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఈరోజు 7 గంటల నుంచే సంబరాలు చేసుకోవాలి. గెలిచిన వాడు రాజు కాదు. ఓడినవారు బానిసలు కారు. అధికార, ప్రతిపక్షాలది బాధ్యతాయుతమైన పాత్ర.

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రజాస్వామ్య విలువలను పునరుద్దరిస్తుంది. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరిస్తాం. తెలంగాణా ప్రజలకు పీసీసీ అధ్యక్షుడుగా మాట ఇస్తున్నా.. సమాజంలో అందరికీ స్వేచ్ఛ, సమానత్వం, సమాన అభివృద్ధి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ.. ప్రజలు ఇచ్చే అధికారాన్ని దుర్వినియోగం చేయదు. ప్రజా సమస్యల పరిష్కారానికే కాంగ్రెస్ అధికారాన్ని ఉపయోగిస్తుంది. మేం పాలకులం కాదు సేవకులం. తెలంగాణకు మొదటి, చివరి శత్రువు కేసీఆర్ కుటుంబంలోని నలుగురే. మిగతా వారంతా మనకు మిత్రులే. ఇన్నాళ్లు కేసీఆర్ కుటుంబంతో అంటకాగినవారు.. ప్రజాక్షేత్రంలో ప్రజలకు క్షమాపణ చెప్పి సేవకులుగా ఉండాలి. బీఆరెస్‌కు 25 సీట్లు దాటవు. తెలంగాణలో కాంగ్రెస్ సునామీ వచ్చింది. ఈ సునామీలో గడ్డపారలే కొట్టుకుపోతాయి.. గడ్డిపోచలు ఎంత..? బీఆరెస్ నేతలు చేసుకునే సంబరాలు వార్ రూమ్‌లో కాదు.. బార్ రూమ్‌లో. అమరుల కుటంబాల సంక్షేమంపై కోదండరాం గారికి బాధ్యతలు అప్పగించాలనుకుంటున్నాం.

KTR: ఎగ్జిట్ పోల్స్ అంతా నాన్సెన్స్.. మళ్లీ మాదే అధికారం: కేటీఆర్

ఈ అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వంలో కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటం. నిర్ణయాలు తీసుకునేటపుడు కాంగ్రెస్ ఆచితూచి వ్యవహరిస్తుంది. కాంగ్రెస్ శ్రేణులు, నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా.. ఇది ఆచితూచి వ్యవహరించాల్సిన సమయం. మా ముందున్న లక్ష్యాలు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రమాణ స్వీకారం, ఆరు గ్యారంటీలకు చట్టబద్దత, ప్రజాస్వామిక పాలన. నేను ఏ పదవిలో ఉండాలో.. ఏ పదవికి రాజీనామా చేయాలో పార్టీ నిర్ణయిస్తుంది” అని రేవంత్ అన్నారు.