బావ కళ్ళల్లో ఆనందం, రోజా సంచలనం

బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ పురంధరేశ్వరిపై మాజీమంత్రి రోజా ఘాటు కామెంట్స్ చేసారు.పురందరేశ్వరి బావ కళ్ళల్లో ఆనందం కంటే భక్తుల కళ్ళల్లో ఆనందం చూడాలని కోరారు.

  • Written By:
  • Publish Date - October 2, 2024 / 11:49 AM IST

బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ పురంధరేశ్వరిపై మాజీమంత్రి రోజా ఘాటు కామెంట్స్ చేసారు.పురందరేశ్వరి బావ కళ్ళల్లో ఆనందం కంటే భక్తుల కళ్ళల్లో ఆనందం చూడాలని కోరారు. సుప్రీమ్ కోర్టు వ్యాఖ్యలను పురందరేశ్వరి పక్కదోవ పట్టిస్తున్నారన్నారు. లడ్డు లో కల్తీ నెయ్యి విషయంపై ఎలాంటి విచారణ చేపట్టకుండానే సీఎం మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు అని మండిపడ్డారు.

ప్రభుత్వం తరుపు లాయర్లు కోర్టు ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు కాబట్టి ధర్మాసనం వ్యాఖ్యలు చేసిందని ముఖ్యమంత్రికి మాట్లాడే అధికారం లేదా అని అమాయకంగా పురందరేశ్వరి ప్రశ్నించడం కరెక్ట్ కాదనన్నారు. పవన్ కళ్యాణ్ కు ఇది సినిమా కాదు. చంద్రబాబు ఏమి చెప్తే అది మాట్లాడేందుకు అని హితవు పలికారు. తప్పు చేశారు కాబట్టే పవన్ చేత ప్రాయశ్చిత్త దీక్ష ను దేవుడు చేయించాడన్నారు. భిన్నమైన ప్రకటనలు చేసిన టిటిడి ఇఓ ను కూడా విచారించాలని డిమాండ్ చేసారు.