నానీ ఆకలి తీరినట్టే… పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్

న్యాచురల్ స్టార్ నానీ అదరగొట్టాడు. కృష్ణార్జున యుద్ధం సినిమా నుంచి విలక్షణ పాత్రల కోసం ట్రై చేస్తున్న నానీకి సరైన బొమ్మ పడింది ఇప్పుడు.

  • Written By:
  • Publish Date - August 14, 2024 / 11:25 AM IST

న్యాచురల్ స్టార్ నానీ అదరగొట్టాడు. కృష్ణార్జున యుద్ధం సినిమా నుంచి విలక్షణ పాత్రల కోసం ట్రై చేస్తున్న నానీకి సరైన బొమ్మ పడింది ఇప్పుడు. “సరిపోదా శనివారం” ట్రైలర్ చూసిన నానీ ఫ్యాన్స్, సినిమా పిచ్చోళ్ళకు నానీ సరైన విందు ఇచ్చాడు అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. సరిపోదా శనివారం ట్రైలర్ నిన్న సాయంత్రం విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ట్రైలర్ కు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ వచ్చింది. ఆగస్ట్ 29 న విడుదల అవుతున్న ఈ సినిమా… ట్రైలర్ సూపర్ హిట్ అయింది.

పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఎస్జే సూర్య… విలన్ గా ఎంత క్రూరంగా ఉంటాడో ట్రైలర్ మొదట్లో చూపించాడు దర్శకుడు. భయంకరమైన పోలీస్ ఆఫీసర్ పాత్రకు ఎస్జే సూర్య సరిగా సరిపోయాడు. ఇక కానిస్టేబుల్ గా హీరోయిన్ ప్రియాంకా మోహన్ నటిస్తుంది. ఈ సినిమాలో నానీ పాత్ర పూర్తిగా డిఫరెంట్ గా ఉంటుంది. తన అనుకున్న వాళ్ళ కోసం ఎక్కడికి అయినా వెళ్ళే నానీ… ఎవరి మీదైనా కోపం వచ్చిందంటే చాలు… వాళ్ళ పేరు రౌండ్ చేసుకుని శనివారమే వాళ్ళను కొడతాడు. ఈ కాన్సెప్ట్ టైటిల్ కు న్యాయం చేసింది.

సాయి కుమార్ కూడా పవర్ ఫుల్ డైలాగులతో ఆకట్టుకున్నారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జకేస్ బిజోయ్… మాస్ ఆడియన్స్ కు నచ్చే విధంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టారు. ఇక దర్శకుడు వివేక్ ఆత్రేయ… యాక్షన్ సీన్లపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టుగా అర్ధమవుతోంది. గత కొన్నాళ్ళుగా మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న నానీకి ఈ సినిమా సరికొత్త రికార్డులతో కెరీర్ లో బెస్ట్ హిట్ ఇస్తోందని ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రముఖ నిర్మాత దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు