Tamilsai Soundararajan : తెలంగాణలో తమిళసై ప్రచారం..

తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ లీడర్ తమిళసై సౌందరరాజన్ నేడు తెలంగానలో ప్రచారం నిర్వహించనున్నారు.

 

 

 

తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ లీడర్ తమిళసై సౌందరరాజన్ నేడు తెలంగానలో ప్రచారం నిర్వహించనున్నారు. తెలంగాణ లో మాజీ గవర్నర్ బీజేపీ సీనియర్ నాయకురాలు తమిళసై సోమవారం నుంచి రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని రాష్ట్ర బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శి జి. ప్రేమేందర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. పది రోజుల పాటు రాష్ట్రంలో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తారని వెల్లడించారు. ఆమెతో పాటు తమిళనాడులకు చెందిన వాలంటీర్లు కూడా పాల్గొననున్నారు. కాగా, ఆమె ఈ ఎన్నికల్లో చైన్నై సౌత్ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే..