అందుకే రిటైర్మెంట్ ఇచ్చేశా ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు

టీమిండియా గబ్బర్ సింగ్ శిఖర్ ధావన్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. తాజాగా ధావన్ తాను క్రికెట్ కు గుడ్ బై ఎందుకు చెప్పాల్సి వచ్చిందో వివరించాడు. గత రెండు సంవత్సరాల్లో అంతర్జాతీయ మ్యాచ్ లు పెద్దగా ఆడలేదని, ఫామ్ లో కూడా లేనని అంగీకరించాడు.

  • Written By:
  • Publish Date - September 26, 2024 / 07:59 PM IST

టీమిండియా గబ్బర్ సింగ్ శిఖర్ ధావన్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. తాజాగా ధావన్ తాను క్రికెట్ కు గుడ్ బై ఎందుకు చెప్పాల్సి వచ్చిందో వివరించాడు. గత రెండు సంవత్సరాల్లో అంతర్జాతీయ మ్యాచ్ లు పెద్దగా ఆడలేదని, ఫామ్ లో కూడా లేనని అంగీకరించాడు. అదే సమయంలో టీమిండియాలో చోటు కోసం దేశవాళీ క్రికెట్ లో ఆడాలన్న ఆసక్తి కూడా లేదని చెప్పుకొచ్చాడు. అందుకే డొమెస్టిక్ క్రికెట్ కు కూడా రిటైర్మెంట్ ప్రకటించానన్నాడు. అలాగే గత కొంతకాలంగా ఎంతో మానసిక ఒత్తిడిలకు గురైయ్యాననీ , రిటైర్మెంట్ నిర్ణయానికి అది కూడా ఓ కారణమని ధావన్ చెప్పాడు.ఓవరాల్ గా తన కెరీర్ పై సంతృప్తిగా ఉన్నానని గబ్బర్ వ్యాఖ్యానించాడు. ధావన్ ప్రస్తుతం లెజెండ్స్ లీగ్ క్రికెట్ లో ఆడుతున్నాడు.