Tirupati Venkanna, Ayodhya : తిరుపతి వెంకన్న స్థానాన్ని.. అయోధ్య రామయ్య ఆక్రమిస్తాడా?

అయోధ్యలో శ్రీరాముడు కొలువుదీరాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువుల కల నెరవేరింది. 5వందల ఏళ్ల తర్వాత భవ్య రామ మందిరంలో.. బాలరాముడి విగ్రహానికి ఘనంగా ప్రాణప్రతిష్ఠ జరిగింది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత.. అయోధ్యలో రాముడు కొలువుదీరడంతో.. ఆ నీలమేఘ శ్యాముణ్ని సందర్శించుకోవడం కోసం భక్తులు పోటెత్తబోతున్నారు. రోజుకు 3లక్షల మంది భక్తులు.. అయోధ్య రాముణ్ని దర్శించుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

అయోధ్యలో శ్రీరాముడు కొలువుదీరాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువుల కల నెరవేరింది. 5వందల ఏళ్ల తర్వాత భవ్య రామ మందిరంలో.. బాలరాముడి విగ్రహానికి ఘనంగా ప్రాణప్రతిష్ఠ జరిగింది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత.. అయోధ్యలో రాముడు కొలువుదీరడంతో.. ఆ నీలమేఘ శ్యాముణ్ని సందర్శించుకోవడం కోసం భక్తులు పోటెత్తబోతున్నారు. రోజుకు 3లక్షల మంది భక్తులు.. అయోధ్య రాముణ్ని దర్శించుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

భక్తుల తాకిడి ఈ ఒక్క ఏడాదికే పరిమితం కాబోదు. రాబోయే 3, 4 ఏళ్లపాటు ఇదే సంఖ్యలో అయోధ్య రాముడి దర్శనం కోసం భక్తులు తరలి వస్తారని అంచనా. ప్రభుత్వం కూడా దీనికి తగినట్లుగానే.. అయోధ్య చేరుకోవడానికి రైలు, విమాన సదుపాయాలను కల్పిస్తోంది. ఏడాదికి 10 లక్షల మందికి ప్రయాణికులు వస్తారనే అంచనాతో అయోధ్య ఎయిర్‌పోర్ట్‌ నిర్మించారు. ఏటా 60లక్షల మంది ప్రయాణికుల సామర్థ్యంతో 2025 నాటికి టెర్మినల్‌ విస్తరించనున్నారు. అయోధ్య ఇక ప్రత్యేక బస్సుల ద్వారానూ భారీ సంఖ్యలోనూ భక్తులు అయోధ్య చేరుకునే అవకాశం ఉంది. దీంతో దేశంలోకెల్లా అత్యంత రద్దీ అయిన ఆలయంగా.. అయోధ్య రామాలయం నిలిచే అవకాశం ఉంది. ఎక్కువ మంది సందర్శించుకునే ఆలయాల జాబితాలో తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయం టాప్‌లో ఉంది.

ఈ ఏడాది ఆ స్థానాన్ని అయోధ్య ఆక్రమించే అవకాశం ఉంది. తిరుమలను ప్రస్తుతం రోజుకు 60వేల నుంచి 80వేల మంది భక్తులు దర్శించుకుంటున్నారు. ఏపీని సందర్శించే పర్యాటకుల్లో… తిరుమలకు వచ్చే భక్తులే అత్యధికం. ప్రపంచంలోకెల్లా సంపన్న ఆలయాల జాబితాలో తిరుమల ముందు వరుసలో ఉండగా.. అయోధ్య కూడా ఈ జాబితాలో చేరనుంది. దేశంలో అత్యధిక మంది భక్తులు సందర్శించే ఆలయాల్లో ఉత్తరప్రదేశ్‌లో ఉన్న కాశీ విశ్వనాథ్ ఆలయం ఒకటిగా ఉంది. ఇప్పుడు రామ మందిరం కూడ ప్రారంభం కావడంతో.. ఆధ్యాత్మికంగా ఉత్తరప్రదేశ్ ప్రాధాన్యం మరింత పెరగనుంది. ఇక అటు అత్యధిక మంది దేశీయ పర్యాటకులు సందర్శించే రాష్ట్రంగా ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్న ఉత్తరప్రదేశ్.. రాముడి రాకతో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోనుంది.