Trivikram , Pooner Kair : గురూజీ ఏదైనా చేయగల సమర్థుడు.. సంచలన వ్యాఖ్యలు

టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ హీరోయిన్ గా తన సినిమాల కంటే కూడా వివాదాల ద్వారానే బాగా పరిచయం. ఇండస్ట్రీలో ప్రముఖులను ఉద్దేశిస్తూ ఆమె పరోక్షంగా ప్రత్యక్షంగా చేసే ట్వీట్స్ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారుతూ ఉంటాయి. వీలు దొరికినప్పుడల్లా.. సంధర్భం ఉన్నా, లేకున్నా వీరిద్దరిపై పరోక్షంగా పూనమ్ వివాదాస్పద ట్వీట్స్ వేస్తూ ఉంటుంది. ఐతే పవన్, దర్శకుడు త్రివిక్రమ్ పై పూనమ్ కి ఎందుకు అంత కసి అనేది ఎవరికీ అర్థం కాని విషయం.

టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ హీరోయిన్ గా తన సినిమాల కంటే కూడా వివాదాల ద్వారానే బాగా పరిచయం. ఇండస్ట్రీలో ప్రముఖులను ఉద్దేశిస్తూ ఆమె పరోక్షంగా ప్రత్యక్షంగా చేసే ట్వీట్స్ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారుతూ ఉంటాయి. వీలు దొరికినప్పుడల్లా.. సంధర్భం ఉన్నా, లేకున్నా వీరిద్దరిపై పరోక్షంగా పూనమ్ వివాదాస్పద ట్వీట్స్ వేస్తూ ఉంటుంది. ఐతే పవన్, దర్శకుడు త్రివిక్రమ్ పై పూనమ్ కి ఎందుకు అంత కసి అనేది ఎవరికీ అర్థం కాని విషయం. ముఖ్యంగా త్రివిక్రమ్ ని గురువు అంటూ సంభోదిస్తూ ఆయనపై సెటైరికల్ ట్వీట్స్ వేస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి గురువుగారిని టార్గెట్ చేసింది వివాదాలబ్యూటీ.

త్రివిక్రమ్ శ్రీనివాస్.. కీర్తి కిరీటాలు అనే నవల ఆధారంగా గుంటూరు కారం తీశారనే టాక్ వినిపిస్తోంది. జోరుగా జరుగుతున్న ప్రచారంపై పూనమ్ సంచలన ట్వీట్ చేసింది. మాటల మాంత్రికుడిని గురూజీ అని సంబోధిస్తునే.. షాకింగ్ ట్వీట్ చేశారు. ఆయన ఏదైనా చేయగల సమర్థుడని.. అందులో నుంచి అంతే సామర్థ్యంతో బయటపడగలడని పూనమ్ కౌర్ కామెంట్స్ చేసింది. ఆయన తప్పుడు పనులకు ప్రత్యేకంగా ముసుగు వేయగలుగుతారని, దీన్ని జనం చూడలేరని అన్నారు. గత ప్రభుత్వాల సీఎంల కార్యాలయాలకు- ప్రత్యేక అనుబంధం ఎలా ఏర్పడిందనే విషయం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటుందని రాసుకొచ్చిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రజెంట్ గుంటూరు కారం మూవీపై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అవుతోంది. అంతేకాక ప్రమోషన్స్ స్పీడ్ పెంచడంతో పాటు ప్రీరిలీజ్ ఈవెంట్ కు భారీగా ప్లాన్ చేస్తున్నారు. పవర్ కల్యాణ్ గెస్ట్ గా రాబోతున్నట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఇలాంటి టైంలో పూనమ్ చేసిన ట్వీట్ నెట్టింట్లో వైరల్ గా మారింది. మరీ పూనమ్ కామెంట్స్ కు త్రివిక్రమ్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.